రాష్ట్రంలో మరోమారు సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేసి ఎన్నో సంక్షేమ పథకాలు అందించి, ప్రజల మెప్పు పొందారని, బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా అని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం కౌడిపల్లి మండలంలోని తునికి, హరిచంద్తండా, దేవులతండా, ముట్రాజ్పల్లి, అర్జున్తండా, రాజిపేట, వెంకటాపూర్, జాజితండా, కుషన్గడ్డతండా, తిమ్మాపూర్, వెంకట్రావుపేట, రాయిలాపూర్, నాగ్సానిపల్లి గ్రామాల్లో వారు ప్రచారం చేశారు.
కౌడిపల్లి, నవంబర్ 3: రాష్ట్రంలో మరోమారు సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం పక్కా అని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. శుక్రవారం కౌడిపల్లి మండలం తునికి, హరిచంద్తండా, దేవులతండా, ముట్రాజ్పల్లి, అర్జున్తండా, రాజిపేట, వెంకటాపూర్, జాజితండా, కుషన్గడ్డతండా, తిమ్మాపూర్, వెంకట్రావుపేట, రాయిలాపూర్, నాగ్సానిపల్లి గ్రామాల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా తునికి నల్లపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధియే లక్ష్యంగా పనిచేసి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించి ప్రజల మెప్పు పొందారని, బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం పక్కా అని అన్నారు. బీఆర్ఎస్ తరుఫున నర్సాపూర్ నియోజకవర్గం నుంచి సునీతాలక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి, సీఎం కేసీఆర్కు గిఫ్టు ఇద్దామని ఓటర్లకు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజల అభ్యున్నతికి పాటుపడుతూ నిరంతరం శ్రమిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. మీ ఇంటి ఆడబిడ్డగా తనకు మీ మద్దతు ఇచ్చి కారు గుర్తుకు ఓటేసి తనకు భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు. అనంతరం మండల పరిధిలోని కొట్టాల గ్రామ మాజీ సర్పంచ్ బెంది రమేశ్గౌడ్ ఆధ్వర్యంలో 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు వారి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ ఉమ్మన్నగారి దేవేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కో-ఆప్షన్ మన్సూర్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు చిలుముల వెంకట్రెడ్డి, ఎంపీపీ రాజునాయక్, జడ్పీటీసీ కవిత అమర్సింగ్, డీసీసీబీ డైరెక్టర్ బాన్సువాడ గోవర్ధన్రెడ్డి, వైస్ ఎంపీపీ నవీన్గుప్తా, మాజీ ఎంపీపీ చిలుముల పద్మానర్సింహారెడ్డి, మహ్మద్నగర్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ చిలుముల చిన్నచిందంరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
చిలిపిచెడ్/ వెల్దుర్తి, నవంబర్ 3: బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. చిలిపిచెడ్ మండల పరిధిలోని బద్రియ తండాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు 50 మంది బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దుర్గానాయక్, కుణ్య నాయక్, చిట్కుల్ మాజీ ఎంపీటీసీ నారాగౌడ్, చిట్కుల్ సర్పంచ్ గోపాల్రెడ్డి, మండలాధ్యక్షుడు అశోక్రెడ్డి ఆధ్వర్యంలో నర్సాపూర్ పట్టణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి సమీక్షంలో పార్టీ చేరారు. వెల్దుర్తి మండలం బస్వాపూర్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాములుతోపాటు మరికొంత మంది నాయకులు, కార్యకర్తలు జడ్పీటీసీ రమేశ్గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి సునీతాలక్ష్మారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బద్రితండాలో పార్టీలో చేరిన కార్యకర్తలు గోవింద్, సోమ్లానాయక్, మాజ్యానాయక్, గణేశ్, లాల్యనాయక్, దుర్గానాయక్, రమేశ్, పాండ్యానాయక్, బస్వాపూర్ కార్యక్రమంలో వెల్దుర్తి ఎంపీటీసీ మోహన్రెడ్డి, నాయకులు పడిగె నర్సింలు, శ్రీనివాస్రెడ్డి, ఊదండపురం నర్సింలు ఉన్నారు.