హవేళీఘనపూర్, డిసెంబర్ 4: చిన్నారి రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో బాలిక మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని బూర్గుపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం..
మండల పరిధిలోని బూర్గుపల్లి గ్రామానికి చెందిన బాబు, నవ్య దంపతుల ఏకైక కుమార్తె కీర్తన (4) ఆదివారం ఆడుకుంటూ రోడ్డు దాటుతున్న క్రమం లో అదే గ్రామానికి చెందిన నవీన్ కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలైన చిన్నారిని మెదక్ దవాఖానకు తరలిస్తుండ గా మార్గమధ్యంలో మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు. బాబు, కీర్తనల ఏకైక కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో గ్రామం లో విషాదఛాయలు అలుముకున్నా యి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృతదేహాన్ని మెదక్ దవాఖానలోని మార్చురీలో ఉంచారు.