కరీంనగర్ కమాన్చౌరస్తా, ఆగస్టు 8 : రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన హయాంలో రాష్ట్రంలోని దేవాలయాలు అభివృద్ధి చెందాయని, అర్చకుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టారని, 12 వేల దేవాలయాలు, 10 వేల మంది అర్చకులకు ప్రయోజనాలు అందాయని అర్చక ఉద్యోగ జాక్ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం డీడీఎన్ అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు పీఆర్సీని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. శనివారం కరీంనగర్లోని కళాభారతిలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీడీఎన్ అర్చకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా 6,700 దేవాలయాలు డీడీఎన్ పథకంలో ఉన్నాయని, వారికి కేసీఆర్ హయాంలోనే గుర్తింపు లభించిందని చెప్పారు. డీడీఎన్ అర్చకుల భవిష్యత్తుకు అడ్డంకిగా ఉన్న ‘సీమ్’ పదాన్ని తొలగించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సమావేశంలో ధూపదీపనైవేద్య రాష్ట్ర సంక్షేమ సంఘం అధ్యక్షుడు అన్నావజ్జుల ప్రసాద్శర్మ, జాక్ కన్వీనర్ డీవీఆర్శర్మ, ప్రధాన కార్యదర్శి వేగ్గలం సంతోష్శాస్త్రి, అర్చక వెల్ఫేర్ బోర్డు సభ్యుడు జకాపురం నారాయణస్వామి పాల్గొన్నారు.