మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 27 : 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని మెదక్ ఆర్డీవో సాయిరాం సూచించారు. ఓటరు నమో దులో భాగంగా ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలోని 162, 163 పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. బీఎల్వోలతో మా ట్లాడి ఓటరు నమోదు ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు నమోదును తిరిగి డిసెంబర్ 3, 4వ తేదీల్లో నిర్వహిస్తామన్నారు. జనవరి 1, 2023 వరకు 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఫారం-6 ద్వారా ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలన్నారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి 18 ఏండ్లు నిండిన వారిని గుర్తించాలన్నారు. ఆయన వెంట రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
ఆధార్తో అనుసంధానం : తహసీల్దార్ నవీన్
మెదక్ రూరల్, నవంబర్ 27 : అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలని తహసీల్దార్ నవీన్ సూచించారు. మెదక్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఓటర్ల నమోదుతోపాటు ఓటరు లిస్టులో మార్పులు, చేర్పులు చేయ డానికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీఎల్వోలు ప్రజల నుంచి ఓటరు నమోదు దరఖాస్తులను స్వీకరించారు. ఓటు ప్రజాస్వామ్యానికి ప్రాణం వంటిందని తహసీల్దార్ నవీన్ పేర్కొన్నారు. ఓటు హక్కును ఆధార్కార్డుతో అనుసంధానం చేయించుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో పేర్లు గల్లంతైనవారు, మార్పులు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలోఅంగన్వాడీ టీచర్ రమాదేవి, బీఎల్వోలు పాల్గొన్నారు.
ఓటు వజ్రాయుధం : తహసీల్దార్ చరణ్
పెద్దశంకరంపేట, నవంబర్ 27 : మండలంలోని ప్రతి గ్రా మంలో ఓటరు నమోదు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ చరణ్ తెలిపారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీంచారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మా ట్లాడుతూ ఓటు రాజ్యాంగ కల్పించిన గొప్ప హక్కు అన్నారు. డిసెంబర్ 3, 4 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు కీలకమని, ఓట వజ్రాయుధమన్నారు. ఇంటిపేరు, పేరు, చిరునామాల్లో సవరణలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పెద్దశంకరంపేటలో నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఓటరు నమోదు ప్రక్రియ చేపట్టారు. కార్యక్రమంలో బీఎల్వో స్వరూప, వీఆర్ఏ భాగయ్య తదితరులు ఉన్నారు.
ఓటు దేశాభివృద్ధికి కీలకం : ఇన్చార్జి ఆర్డీవో సాయిరాం
నర్సాపూర్, నవంబర్ 27 : ప్రజలకు ఓటు వజ్రాయుధంలాంటిదని, దేశ అభివృద్ధికి రాజ్యాంగం అమలులో కీలకపాత్ర పోషిస్తుందని ఇన్చార్జి ఆర్డీవో సాయిరాం అన్నారు. నర్సాపూర్ పట్టణంలోని పోలింగ్బూత్ను పరిశీలించి, ఓటరు నమోదు వివరాలను బూత్ లెవెల్ అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గోడ రాజేందర్, నగేశ్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
తప్పులను సవరించుకోవాలి : తహసీల్దార్ ఆదర్శ్కుమార్
చిలిపిచెడ్, నవంబర్ 27 : యువత తప్పనిసరిగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తహసీల్దార్ ఆదర్శ్కుమార్ సూచించారు. చిలిపిచెడ్ మండలంలోని చండూర్, చిట్కుల్, గౌతాపూర్ గ్రామాల్లో ఓటరు నమోదు నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఓటరు జాబితాలో మా ర్పులు, చేర్పులకు 8, 8ఏ ఫారాలతో ఆన్లైన్, మీసేవ, గ్రామాల్లోని బూత్ లెవల్ అధికారులకు అందజేయాలన్నారు. కార్యక్రమంలో వీఆర్ఏలు, బీఎల్వోలు పాల్గొన్నారు.
అనర్హులను తొలిగించాలి : తహసీల్దార్ ఎండీ మన్నన్
రామాయంపేట, నవంబర్ 27 : కొత్త ఓటర్లను చేర్చుకొని ఓటరు లిస్టులో పేరుండి స్థానికంగా లేనివారికి నోటీసు ఇచ్చి, వారి పేర్లను తొలిగించాలని బీఎల్వోలను తహసీల్దార్ ఎండీ మన్నన్ ఆదేశించారు. రామాయంపేటలో ఓటరు నమోదును పరిశీలించి, బూత్ లెవల్ ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. ఓటరు జాబితాను పరిశీలించి, స్థానికంగా విచారించి అనర్హుల పేర్లను తొలిగించాలన్నారు. కొత్తగా గ్రామాలకు వచ్చిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండాలన్నారు. పట్టణంలో రెండు రోజుల పాటు ఓటరు నమోదును నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ రాజు, బీఎల్వోలు బల్ల జమున, ఎడ్ల రాధ, జి.రాణి, జూనియర్ అసిస్టెంట్ శివరాజు ఉన్నారు.