మెదక్రూరల్, డిసెంబర్ 6 : గంజాయి, ఇతర మత్తు పదార్థాలను సేవించినా.. విక్రయించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మెదక్ రూరల్ ఎస్సై మోహన్రెడ్డి హెచ్చరించారు. మెదక్ మండల పరిధిలోని పేరురూ గ్రామ శివారులో గరుడ గంగాసరస్వతీ ఆలయం వద్ద మంగళవారం పోలీసులు వాహనల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఆదే సమయంలో అనుమానితంగా ఒక బైకుపై ముగ్గురు వ్యక్తులు రాగా, వారిని విచారిం చి, తనిఖీ చేశారు. వారినుంచి 240 గ్రాముల ఎండు గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు.
ఎస్సై సమక్షంలో తహసీల్దార్ నవీన్ పంచనామా నిర్వహించారు. వారు ఇచ్చిన సమాచారంతో పేరు రూ బస్టాండ్లో ఉన్న మరో ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. వీరినుంచి 250గ్రాముల ఎండు గంజాయి, రూ.5200 నగదు, నాలుగు ఫోన్లు, బైకును స్వాధీనం చేసుకున్నారు. గంజాయితోపాటు బానోత్ గణపతి, నిఖిల్, నరేందర్గౌడ్, సుధీర్, నవీన్ను పోలీస్స్టేషన్కు తరలించారు. వీరిపై ఎన్డీపీఎస్ కేసు నమోదు చేసి రిమాండ్ చేసినట్లు ఎస్సై మోహన్రెడ్డి తెలిపారు.