సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 27 : సిద్దిపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం నాలుగో రోజు మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1013 మంది అభ్యర్థులకు 886 మంది ఈవెంట్స్లో పాల్గొనగా, 578 మంది తుది పరీక్షకు ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ నాలుగో రోజు మహిళా అభ్యర్థులకు విజయవంతంగా ఈవెంట్స్ పూరైనట్లు తెలిపారు.
మహిళా అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులకు పండ్లు, గ్లూకాన్ డీ, తాగునీటి సౌకర్యంతో పాటు మహిళా మెడికల్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు జరిగే పరిసరాలను పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో ఉంచడం జరిగిందని, ఇందు కోసం ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశామని, ఈవెంట్స్ పూర్తయ్యేవరకు మానిటర్ చేస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఏఆర్ అడిషనల్ డీసీపీలు అడ్మిన్ రామచంద్రరావు, సుభాష్ చంద్రబోస్, ట్రాఫిక్ ఏసీపీ ఫణిందర్, సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి, సంగారెడ్డి డీటీసీ డీఎస్పీ ప్రభాకర్, ఆర్ఐలు, సీఐలు, ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.