కంది డిసెంబర్ 16: సంగారెడ్డి జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఎనిమిది రోజులుగా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు శుక్రవారం కూడా కొనసాగాయి. జిల్లా ఎస్పీ రమణకుమార్ స్వయంగా దేహదారుఢ్య పరీక్షలను పర్యవేక్షించారు. పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఉదయం ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలకు 1215 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, అందులో 1078 మంది హాజరయ్యారు. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు లాంగ్జంప్, షాట్పుట్, రన్నింగ్ పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షలకు 412 మంది అభ్యర్థులు రాత పరీక్షకు అర్హత సాధించారు. 666 మంది అభ్యర్థులు అర్హత సాధించలేదు. పరీక్షల తీరును ఎస్పీ రమణకుమార్ స్వయంగా పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాలతో ప్రత్యే క నిఘాలో ఈ పరీక్షలు కొనసాగిస్తున్నారు. దేహదారుఢ్య పరీక్షలు శనివారంతో ముగియనున్నాయి. ఈ పరీక్షల్లో నిర్వహణలో డీఎస్పీ రవీందర్, బాలాజీ, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.