సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 23 : సిద్దిపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ అభ్యర్థులకు శారీరక దేహ దారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రెండోరోజూ 765 మంది అభ్యర్థులకు 633 మంది అభ్యర్థులు హాజరుకాగా, 132 మంది గైర్హాజరయ్యారు. వీరిలో 322 మంది అభ్యర్థులు అన్ని విభాగాల్లో ఉత్తీర్ణత సాధించి తుది పరీక్షకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ.. ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తి పారదర్శకంగా, సాంకేతిక పరిజ్ఞానంతో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నామన్నారు.
ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా ఆర్ఎఫ్ఐడీ ప్యాడ్లు ఉపయోగించడం ఈవెంట్స్ నిర్వహిస్తున్నామన్నారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, ఎవరైనా ప్రలోభాలకు గురి చేస్తే వెంటనే08475-226333 నెంబర్కు ఫోన్ చేసి చీఫ్ సూపరింటెండెంట్కు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఏఆర్ అడిషనల్ డీసీపీలు అడ్మిన్ రామచంద్రరావు, సుభాష్ చంద్రబోస్, ట్రాఫిక్ ఏసీపీ ఫణిందర్, సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి, సంగారెడ్డి ఏఆర్ డీఎస్పీ జనార్దన్, ఆర్ఐలు, సీఐలు, ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.