సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 7: అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం రాత్రి సంగారెడ్డిలోని ఓ ఫంక్షన్హాలులో జరిగిన కార్యక్రమంలో మంత్రి కులసంఘాల భవనాలకు పట్టా పత్రాలను అందజేశారు. గౌడ సంఘం, ముదిరాజ్ సంఘం, పద్మశాలి సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి రూ.25 లక్షల చొప్పున అందజేశారు. అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్లోని కోకాపేటలో కులసంఘాల ఆత్మగౌరవ భవనాలు నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోనూ ఆయా కులసంఘాల ఆత్మగౌరవ సంఘాలను నిర్మించి ఆయా కులాల సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెప్పా రు. ఒక్కో భవనానికి రూ.కోటి అందజేస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి సీఏం కేసీఆర్ కృషి చేస్తున్నారని వివరించారు. ట్యాంక్ బండ్పై కులసంఘాల మహనీయుల విగ్రహాలను ఏర్పా టు చేసుకున్నామని, వారి జయంతి, వర్ధంతులను ఘనంగా, అధికారికంగా నిర్వహించుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని చెప్పారు.
సంగారెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి చెం దుతున్నదని, రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. సంగారెడ్డి అభివృద్ధికి ఎల్లవేళలా అండుబాటులో ఉండి కృషి చేస్తున్న చింతా ప్రభాకర్కు సీఎం కేసీఆర్ ఈసారి అవకాశం ఇచ్చినందున, ఆయనకు ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీలో మరికొంత మంది నాయకులకు వివిధ రాజకీయకంగా అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సంగారెడ్డి అభివృద్ధికి సహకరించిన సీఏం కేసీఆర్, మంత్రి హరీశ్రావులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈసారి తనను ఆశీర్వదించి మరింత సేవ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. అనంతరం ఆయా కులసంఘాల నాయకులకు మంత్రి చేతుల మీదుగా పార్టీ కండువా వేసి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, కలెక్టర్ శరత్, డీసీసీబీ వైస్చైర్మన్ మాణి క్యం, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, ఆయా కులసంఘాల నాయకులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.