కోట్పల్లి/బంట్వారం, జూలై 8: పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలతో పల్లెల రూపు రేఖలు మారిపోయాయని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. అనంతరం రాంపూర్ గ్రా మంలో పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. డంపింగ్ యార్డు, నర్సరీని పరిశీలించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతితో అన్ని పల్లెల్లో పండుగ వాతావరణం తలపిస్తుందన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికులను ప్రశంసిస్తూ సన్మానం చేశారు. బం ట్వారం మండల పరిధిలోని రొంపల్లి గ్రామంలో పలు కాలనీలను సందర్శించి పరిశీలించారు.
కొంషెట్పల్లిలో పర్యటించిన అదనపు కలెక్టర్
మర్పల్లి, జూలై 8 : మండల పరిధిలోని కొంషెట్పల్లి గ్రామాన్ని వికారాబాద్ అదనపు కలెక్టర్ చంద్రయ్య గురువారం సందర్శించారు. ఎస్సీ కాలనీలో మురుగు కాలువల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయన్నారు. అనంతరం మొక్కలు నాటి నీళ్లు పోశారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
వికారాబాద్, జూలై 8 :గ్రామాల్లోని పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వికారా బాద్ ఆర్డీవో ఉపేందర్రెడ్డి తెలిపారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలోని సర్పన్పల్లి, జైదు పల్లి, గోదుమగూడ గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్యం, మంచి నీటి లీకేజ్, శిథిలావస్థకు చేరిన ఇండ్లను తొలగించాలన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు వివరించారు. ఇండ్ల ముందు అందంగా కనిపించేలా పూల మొక్కలు, పండ్ల మొక్కలు నాటేల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామాల్లలో నిర్మిం చిన వైకుంఠదామం, ప్రకృతి వనాలను పరిశీలించి పలు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రకళ, ఎంపీడీవో సుభాషిణి, ఎంపీవో నాగరాజు, స్థానిక సర్పంచ్లు షాకిరాభేగం, ఎల్లమ్మ, అనీత, ఆర్ఐ మోహన్, పంచాయతీ కార్యదర్శి నవనీత తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన ఉపాధ్యాయులు
బొంరాస్పేట, జూలై 8 :మండలంలోని దుద్యాల ఉన్నత పాఠశాలలో గురువారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో సర్పంచ్ మహ్మద్ ఖాజా, ఉపా ధ్యాయులు పలు రకాల మొక్కలు నాటారు. నాటిన మొక్కలను సంరక్షించాలని సర్పంచ్ సూచిం చారు. కార్యక్ర మంలో పంచాయతీ కార్యదర్శి జైపాల్, ఇన్చార్జ్ హెచ్ఎం నెహ్రూచౌహాన్, ఉపాధ్యా యులు సుధాకర్రావు, వెంకటయ్య, లక్ష్మణ్, పీఈటీ అనిల్కుమార్, సీఆర్పి శశివర్ధన్ పాల్గొన్నారు.
తాసీల్దార్ కార్యాలయం ఆవరణలో మొక్కలు
కొడంగల్, జూలై 8: కొడంగల్ తాసీల్దార్ కార్యాలయం ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్క లు నాటేందుకు సిద్దం చేసినట్లు డిప్యూటీ తాసిల్దార్ ఆనంద్ తెలిపారు. కార్యాలయం ఆవరణ పూర్తిగా పచ్చదనంతో నింపే విధంగా మొక్కల పెంపకం చేపడతామని ఆయన పేర్కొన్నారు.
పనులు పరిశీలించిన ఎంపీడీవో
కొడంగల్, జూలై 8 : కొడంగల్ మండలంలోని చిన్ననందిగామ, ప్యాలమద్ది గ్రామాలలో శుక్రవారం ఎంపీడీవో మోహన్లాల్ పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనులలో వేగం పెం చాల్సిందిగా ఎంపీడీవో అధికారులను ఆదేశించారు.వర్మి కంపోస్టు, వైకుంఠధామం నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీవో పలు సూచ నలు చేశారు.