వేములపల్లి, ఏప్రిల్ 24: నల్లగొండ జిల్లాలో రోడ్ షోకు హాజరైన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్లో స్వల్పప్రమాదం చోటుచేసుకున్నది. బుధవారం నార్కట్పల్లి-అద్దంకి హైవే మీదుగా మిర్యాలగూడ పట్టణానికి వెళ్తుండగా వేములపల్లి మండల కేంద్రం సమీపంలోని ఇసుకబావిగూడెం డొంకదారి వద్ద కాన్వాయ్లోని ఐదు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
వాహనాలు స్వల్పంగా దెబ్బతినగా, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం వాహనాలు మిర్యాలగూడకు బయలుదేరి వెళ్లాయి.