పాట్నా: లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) రాజ్యాంగం ప్రకారం చిరాగ్ పాశ్వాన్ ఇప్పుడు ఎల్జేపీ జాతీయ అధ్యక్షుడు లేదా పార్లమెంటరీ పార్టీ నాయకుడు కాదని ఆ పార్టీకి చెందిన పశుపతి కుమార్ పరాస్ తెలిపారు. గురువారం జరిగిన ఎన్నికలు పార్టీ రాజ్యాంగం ప్రకారం పూర్తిగా చెల్లుబాటు అయ్యాయని చెప్పారు. ఈ ఎన్నికల గురించి చిరాగ్ పాశ్వాన్కు ఏమీ తెలియదని పరాస్ అన్నారు.
మరోవైపు ఎల్జేపీ జాతీయ అధ్యక్షుడితోపాటు పార్టీ పార్లమెంటరీ నేత తానేనని చిరాగ్ పాశ్వాన్ చెబుతున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుల సమ్మతి లేఖలు తన వద్ద ఉన్నాయన్నారు. పార్టీని కాపాడుకునేందుకు అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తానని, సుదీర్ఘ పోరాటానికి సిద్ధమని అన్నారు.