సిర్గాపూర్, జనవరి 1: రైతుల సంక్షేమాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ పాలనకు దేశంలో నిరాజనం పడుతున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పొట్పల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామానికి చెందిన 16 కుటుంబాలకు చెందిన 200 మంది సభ్యులు పార్టీలో చేరగా, వారికి ఎమ్మెల్యే కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరికీ తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటానని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వంపై బురుద జల్లుతున్నారని ఆరోపించారు. వారు చెప్పే మాయమాటలు నమ్మొద్దన్నారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ ఫలాలను చూసి ప్రజలు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు.
కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా చిల్లర్గిలో బీజేపీ, కాంగ్రెస్ నుంచి కార్యకర్తలు, కేసీఆర్ పాలన కావాలంటూ పార్టీలో చేరారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాఘవరెడ్డి, ఎంపీపీ మహిపాల్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు ఎమ్మెల్యే తనయుడు రోషన్రెడ్డి, సర్పంచ్ గంగూబాయి, వైస్ ఎంపీపీ ప్రయాగమాధవరావు, నాయకులు వెంకట్రావు, రాజు, పార్టీలో చేరిన వారిలో ఎనుగుంద తుక్కారెడ్డి, నర్సింహరెడ్డి, జనార్దన్రెడ్డి, సంజీవరెడ్డి, విష్ణురెడ్డి, పుండ్లిక్రెడ్డి, రాజురెడ్డి, అనిల్రెడ్డి, వీరారెడ్డి, హన్మంత్రెడ్డి, శంకర్రెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకట్రెడ్డి, సునీల్రెడ్డి, సంజీవ్, మోహన్రెడ్డి, పండరిగొండ, భోజ్రెడ్డి, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.