రామాయంపేట, డిసెంబర్ 29ః బోధన, అభ్యాసన ఉపకరణాలపై ప్రతిభను కనబర్చిన ఉపానాధ్యాయులకు ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులను అందజేసినట్లు రామాయంపేట ప్రభుత్వ విద్యా సంస్థ నోడల్ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు.గురువారం రామాయంపేట పట్టణంలోని శారద బంకెట్ ఆల్లో బుధవారం నిర్వహించిన బోధన అభ్యాసన కార్యక్రమంలో ప్రతిభను కనబర్చిన ఉపాధ్యాయులకు బహుమతులను అందజేసి జిల్లా స్థాయికి 20మంది బోధనా ఉపకరణాలలో ప్రతిభను చూపిన టీచర్లను ఎంపిక చేశారు.ఎంపికైన 20 మంది టీచర్లు మెదక్ జిల్లా కేంద్రంలో త్వరలో జరిగే జిల్లా స్థాయి టీఎల్ఎం పోటీలకు హాజరు కావాలన్నారు.ఒక్కో సబెక్టుకు నలుగురు చొప్పున ఐదు సబ్జెక్టులకు 20మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయడం జరిగిందన్నారు.రామాయంపేట పట్టణంలో చూపిన ప్రతిభను జిల్లా చూపించాలని ఉపాధ్యాయులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్సు హెచ్ఎంలు రవీందర్రావు, సవిత, సుదర్శనమూర్తి, రవీందర్గౌడ్, అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, టీచర్లు హాజరైనట్లు తెలిపారు.
స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి
-పీఏసీఎస్ చైర్మన్ చిలుముల హనుమంత్రెడ్డి
మెదక్ రూరల్, డిసెంబర్ 29 : విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని సమాజ అభివృద్ధికి పాటుపడాలని పీఏసీఎస్ చైర్మన్ చిలుముల హన్మంత్రెడ్డి సూచించారు. బయర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్లో భాగంగా ఫ్రీ కమర్షియల్ సీడ్ ప్రొడక్షన్ రైస్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం మెదక్ మండలం ర్యాలామడుగు ప్రాథమిక ఉన్నతపాఠశాల విద్యార్థులకు జ్యూట్ బ్యాగులు, పెన్నులు, టూత్బ్రష్లు అం దజేశారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ హన్మంత్రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను బోధిం చి, విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థులు సైతం ప్రభుత్వ సహకారాన్ని వినియోగించుకొని, ఉన్నతంగా ఎదగాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించడం శుభపరిమణమన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పూర్వ వి ద్యార్థులు, స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని పిలు పునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ రజినీభిక్షపతి, ప్రధానోపాధ్యాయురాలు అమరావతి, రీజినల్ హెడ్ శార్వ, మౌర్య, ఆర్.శ్రీనివాస్, కె.శ్రీనివాస్, శ్రీధర్రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ దావిద్, ఉపాధ్యాయుడు వైద్య శ్రీనివాస్ పాల్గొన్నారు.
పాఠశాలకు కంప్యూటర్లు అందజేత…
వెల్దుర్తి, డిసెంబర్ 29 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి వరలక్ష్మి ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తుందని సంస్థ ప్రతినిధులు వెంకటరమణ, నాగేశ్వరరావు అన్నారు. గురువారం మాసాయిపేట మండల పరిధిలోని రామంతాపూర్తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రెండు కంప్యూటర్లు, పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు టై, బెల్టులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో ముఖ్యమన్నారు. గ్రామీణ విద్యార్థులకు సైతం కంప్యూటర్ విద్య అందించాలనే ఉద్దేశంతో కంప్యూటర్లను అందజేశామన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించడంతో పాటు బోధన సామగ్రి, ఇతర వస్తువులను అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు ఉదయశ్రీతోపాటు వరలక్ష్మి ఫౌండేషన్ సంస్థ ప్రతినిధి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఓయూ పీజీ కళాశాలలో ఫ్యాకల్టీని నియమించాలి
నర్సాపూర్, డిసెంబర్ 29 : పట్టణంలోని ఓయూ పీజీ కళాశాలలో ఫ్యాకల్టీని నియమించాలని అభిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు ప్రిన్సిపాల్ మహేశ్వర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నగర కార్యదర్శి రా హుల్, సంయుక్త కార్యదర్శి అక్షయ్ మాట్లాడుతూ.. పీజీ కళాశాలలో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ను నియమించాలన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.