నంగునూరు. మార్చి 26: మండలంలోని ముండ్రాయి, వెంకటాపూర్ రోడ్డులో మంగళవారం ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ. 2,33,900 నగదును ఫ్లయింగ్ స్కాడ్ బృందం సీజ్ చేసింది. ముండ్రాయి-వెంకటాపూర్ రోడ్డులో ఎఫ్ఎస్టీ బృందం వాహన తనిఖీలు చేస్తుండగా.. చేర్యాల మండ లం ఆకునూరు గ్రామానికి చెందిన రేసు బాలమల్లు తన కారులో ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.2,33,900 నగదును తీసుకొని వెళ్తుండగా గుర్తించి సీజ్ చేశారు. ఆ నగదును కలెక్టరేట్లోని గ్రీవెన్స్ సెల్లో డిపాజిట్ చేశా రు. అధికారులకు సరైన ఆధారాలు చూపిస్తే డబ్బులు రిలీజ్ చేయించుకోవచ్చని అధికారులు సూచించారు.