మనోహరాబాద్, జనవరి 11: ఆపత్కాలంలో నిరుపేదలకు అండగా సీఎంఆర్ఎఫ్ నిలుస్తుందని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మండలంలోని కూచారం గ్రామానికి చెందిన సాహెబ్రావు కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడు తూ నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.
ఈ విషయా న్ని ఎఫ్డీసీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా ఎల్వోసీని ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అతనికి వచ్చిన రూ. 2.5లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును సర్పంచ్ నరేందర్రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కాళిదాసన్, నాయకులు పురం రవి ముదిరాజ్, నరేశ్ ముదిరాజ్, రవి ముదిరాజ్ పాల్గొన్నారు.