మెదక్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 2,44,933 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో పురుషులు 1,16,083 మంది కాగా, మహిళలు 1,28,850 మంది ఉన్నారు. ఇప్పటి వరకు 25,918 మందికి కంటి అద్దాలను పంపిణీ చేయగా, మరో 24,608 మందికి కంటి అద్ధాల కోసం ఆర్డర్లు ఇచ్చారు. ఇదిలా ఉండగా మంగళవారం జిల్లాలో 42వ రోజు 35 బృందాలు పాల్గొనగా, 5353 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 454 మందికి కంటి అద్దాలను పంపిణీ చేయగా, 456 మందికి కంటి అద్దాల కోసం రిఫర్ చేసినట్టు డీఎంహెచ్వో చందునాయక్ తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో16981 మందికి పరీక్షలు…
సంగారెడ్డి, మార్చి 21: జిల్లాలో మంగళవారం 66 కంటి వెలుగు శిబిరాల్లో 16981 మందికి పరీక్షలు చేశారు. 920 మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేశారు. మరో 792 మందికి అద్దాలను అందజేశారు. ఆపరేషన్లు అవసరమున్న 1443 మందికి ఇతర దవాఖనాలకు శస్త్ర చికిత్సల నిమిత్తం ప్రతిపాదించారు.