అభాగ్యుల పాలిట ఆసరాగా మారి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది ఆసరా పింఛన్. వృద్ధులకు చేతికర్ర వలే ఊతమిస్తున్నది. దివ్యాంగులు దిగులు చెందకుండా వారికి సీఎం కేసీఆర్ లాంటి పెద్దన్న ఉన్నాడన్న భరోసా కల్పిస్తున్నది. బతుకు జీవుడా అంటున్న వితంతువులు, ఒంటరి మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ, ముందడుగు వేసేందుకు ధైర్యాన్ని కల్పిస్తున్నది ఆసరా పింఛన్. సమైక్య పాలనలో పింఛన్దారుడు చనిపోతేనే ఆ పింఛన్ కొత్తవారికి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అర్హులందరికీ పింఛన్ అందిస్తూ ప్రభుత్వం ఆర్థిక ధీమా, సామాజిక భద్రతను కల్పిస్తున్నది.
అభాగ్యుల పాలిట ఆసరాగా మారి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది ఆసరా పింఛన్. వృద్ధులకు చేతికర్ర వలే ఊతమిస్తున్నది. దివ్యాంగులు దిగులు చెందకుండా వారికి సీఎం కేసీఆర్ లాంటి పెద్దన్న ఉన్నాడన్న భరోసా కల్పిస్తున్నది. బతుకు జీవిడా అంటున్న వితంతవులు, ఒంటరి మహిళలకు ఆర్థిక స్వావలంభన కల్పిస్తూ, ముందడుగు వేసేందుకు ధైర్యాన్ని కల్పిస్తున్నది ఆసరా..
గత ప్రభుత్వాల హయాంలో పింఛన్లు రూ.70, ఆ తర్వాత 200 ఇచ్చేవారు. అవి కూడా అందరికీ వచ్చేవి కావు. కొత్తగా ఓ వ్యక్తికి పెన్షన్ ఇవ్వాలంటే మరో పెన్షన్దారుడు చనిపోతే తప్పా వచ్చేది కాదు. అందుకే తెలంగాణ ఉద్యమ సమయంలోనే సీఎం కేసీఆర్ ఇలాంటి దారుణాలను ప్రజలకు వివరిస్తూ స్వరాష్ట్రంలో సంక్షేమం గురించి ఆలోచించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించి, తాను ముఖ్యమంత్రి అయ్యాక ఆసరా పెన్షన్ల పెంపుపై దృష్టి సారించారు. రూ.200 నుంచి వృద్ధాప్య, వితంతు పెన్షన్ను వెయ్యి రూపాయలకు, దివ్యాంగుల పెన్షన్ను రూ.1500కు పెంచి ఆసరాగా నిలిచారు. అర్హులైన ప్రతి ఒకరికీ పెన్షన్ అందేలా చర్యలు చేపట్టారు. 2018 ఎన్నికల సమయంలో మరోసారి ఆసరా పెన్షన్లను పెంచనున్నుట్లు ప్రకటించి, అధికారంలోకి రాగానే డబుల్ చేశారు. వృద్ధాప్య, వితంతువుల పెన్షన్లను రూ.2,016కు, దివ్యాంగుల పెన్షన్ రూ.3,016కు పెంచారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి దివ్యాంగుల పెన్షన్ను రూ.4,016కు పెంచి అమలుచేస్తున్న విషయం తెలిసిందే.
మెదక్ జిల్లాలో 1,16,604 పింఛన్లు ప్రతి నెలా లబ్ధిదారులకు అందుతున్నాయి. వీటి కోసం ప్రతినెలా రూ.26 కోట్ల 41లక్షల 86 వేల 736 పింఛన్దారులకు అందుతున్నది. జిల్లాలో వృద్ధులు 39,871 మంది, దివ్యాంగులు 8544, వితంతువులు 46,166 మంది, గీతా కార్మికులు 910, ఒంటరి మహిళలు 4257, చేనేత కార్మికులు 482 మంది ఉన్నారు. వీరికి ప్రతి నెలా రూ.26 కోట్ల 41 లక్షల 86 వేల 736లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించే నాటికి రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కింద వృద్ధులకు రూ.200లు అందేది. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2000లకు పెంచింది. దివ్యాంగులకు ఆసరా పథకం కింద నెలకు రూ.500 పింఛన్ అందేది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1500కు పెంచింది. కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక రూ.3016 చేశారు. ప్రస్తుతం మరో వెయ్యి పెంచి రూ.4016 చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నుంచి అమలుచేస్తూ జీవో జారీ చేసింది. ప్రస్తుతం జిల్లాలో పింఛన్ తీసుకునే దివ్యాంగులు 8,544 మంది ఉండగా, వారికి ప్రతి నెలా రూ.3016 చొప్పున రూ.25 లక్షల 76వేలు చెల్లిస్తున్నది.
జిల్లాలో దార్రిద్య దిగువ రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికి ఆసరా పథకం వర్తింపజేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే భర్త చనిపోతే వితంతువులకు వెంటనే ఆసరా పింఛన్ పథకంలో అర్హురాలిగా గుర్తించేలా ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో వితంతువుల నుంచి ఆసరా పథకానికి దరఖాస్తులు స్వీకరించడంతోపాటు గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేకంగా సర్వే నిర్వహించి, లబ్ధిదారుల పేర్లు గుర్తించారు. ఈ నెలాఖరులోగా కొత్తగా గుర్తించిన వారి జాబితాను ప్రకటించనున్నారు. వీరికి త్వరలోనే రూ.2016 నగదు మొత్తాన్ని ఆసరా పింఛన్ కింద అందజేయనున్నారు.
కుటుంబ సామాజిక భద్రతలో భాగంగా ఆసరా పథకానికి అర్హులుగా 57 ఏండ్లకు పైబడి ఉన్న భార్యాభర్తల్లో ఒకరికి మాత్రమే కుటుంబానికి వర్తింపజేసేలా గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆసరా పింఛన్ పొందుతున్న వృద్ధుడి భార్య చనిపోతే.. ఆయన స్థానంలో 57 ఏళ్లకు పైబడి ఉండే భార్యలకు ఆ స్థానంలో అర్హత కల్పించేలా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నిరుపేద కుటుంబాల్లో భార్య చనిపోయినా.. వారికి సామాజిక భద్రత కల్పించేలా ఆసరా పథకాన్ని అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు.