మెదక్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైలు మరికొన్ని గంటల్లో మెదక్లో కూత పెట్టనుంది. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మెదక్-అక్కన్నపేట రైల్వే లైన్ నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేశాయి. మెదక్-అక్కన్నపేట రైల్వే లైన్ 17.2 కిలోమీటర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.210.75 కోట్ల నిధులు మంజూ రు చేశాయి. ఇందులో తెలంగాణ ప్రభుత్వం రూ.85.75 కోట్లు మంజూరు చేయగా, కేంద్ర ప్రభుత్వం 50శాతం నిధులను మంజూరు చేసింది. అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ మార్గంలో మూడు స్టేషన్లను ఏర్పాటు చేశారు. అక్కన్నపేట, లక్ష్మాపూర్, శమ్నాపూర్తో పాటు మెదక్ రైల్వే స్టేషన్ను నిర్మించారు. ఈ లైన్ తోమెదక్ నుంచి అక్కన్నపేట, మిర్జాపల్లి మీదుగా సికింద్రాబాద్ రైల్వేలైన్కు అనుసంధానం చేశారు.
శుక్రవారం మెదక్ నుంచి కాచిగూడ వరకు రైలు మార్గం గుండా వెళ్లే ప్యాసింజర్(ప్రత్యేక) రైలును కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ హేమలత, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డిలు జెండా ఊపి ప్రారంభించనున్నారు.
కాచిగూడ నుంచి మెదక్కు స్పెషల్ ట్రైన్ నడుపనున్నట్టు దక్షి ణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ట్రైన్ నంబర్ 071577 ఈ ట్రైన్ కాచిగూడ నుంచి ఉదయం 7.45 గంటలకు బయలుదేరి 11.10 గంటలకు మెదక్కు చేరుకుంటుంది. ఈ ట్రైన్ సీతాఫల్మండి, మల్కాజిగిరి, కావలరి బ్యారక్స్, బొల్లారం, గుండ్లపోచంపల్లి, గౌడవెల్లి, మేడ్చల్, డబిలిపూర్, మనోహరాబాద్, మాసాయిపేట, శ్రీనివాస్నగర్, వడియారం, అక్కన్నపేట, లక్ష్మాపూర్, శమ్నాపూర్ స్టేషన్ల మీదుగా మెదక్ రైల్వేస్టేషన్లో ఆగుతుంది. సాయంత్రం 5.10 గంటలకు మెదక్ నుంచి ఈ ట్రైన్ బయలుదేరి కాచిగూడకు 7.20 గంటలకు చేరుకుంటుంది. శమ్నాపూర్, లక్ష్మాపూర్, అక్కన్నపేట, మిర్జాపల్లి, వడియారం, శ్రీనివాస్నగర్, మాసాయిపేట, బ్రహ్మణపల్లి, మనోహరాబాద్, డబిలిపూర్, మేడ్చల్, గౌడవెల్లి, గుండ్లపోచంపల్లి, బొల్లారం, బ్యారక్స్, మల్కాజీగిరి, సీతాఫల్మండి స్టేషన్ల మీదుగా కాచిగూడకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. అలాగే మహబూబ్నగర్ నుంచి సాయంత్రం 4.20 గంటలకు ప్యాసింజర్ రైలు ప్రారంభమై కాచిగూడకు 7.20 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి మెదక్కు రాత్రి 10.30 గంటలకు చేరుకుంటుంది.
మెదక్ నుంచి కాచిగూడకు ప్రత్యేక రైలు ప్రారంభోత్సవం కానున్న సందర్భంగా మెదక్ రైల్వేస్టేషన్లో రైల్వే శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రైల్వేస్టేషన్ను అందంగా తీర్చిదిద్దారు. రైల్వేస్టేషన్ బయట ప్రాంతంలో తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా బతుకమ్మ బొమ్మలను వేశారు. అంతేకాకుండా బుక్కింగ్ కౌంటర్ వద్ద ప్రఖ్యాతి ప్రసిద్ధిగాంచిన ఆసియా ఖండంలోనే అతి పెద్ద రెండో చర్చిగా పేరుగాంచిన మెదక్ చర్చిని గోడపై చిత్రీకరించారు. కాడెడ్ల బొమ్మలను అందంగా తీర్చిదిద్దారు. ఇలా మెదక్ రైల్వే స్టేషన్లో ఎటు చూసినా తెలంగాణ సాంప్రదాయాన్ని తీర్చిదిద్దేలా బొమ్మలు కనిపిస్తున్నాయి.