మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 13: మరో 20 ఏండ్లు రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని.. మున్సిపల్ వైస్చైర్మన్ మల్లికార్జున్గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 25 వార్డులో కౌన్సిలర్ కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన వార్డు కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో రెండు సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి నిరుపేదల కుటుంబాల్లో వెలుగు నింపిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికి అందేలా చూడాలన్నారు. నూతనంగా ఎన్నికైన వార్డు కమిటీ సభ్యులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. 25 వార్డు కమిటీ అధ్యక్షుడిగా రుక్మల్చారి, కార్యదర్శిగా కృష్ణచారి, ఉపాధ్యక్షుడిగా వెంకటేశం, సంయుక్త కార్యదర్శిగా మహమ్మద్అలీ, కోశాధికారిగా శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా మధుసూదన్రెడ్డి, ఎస్ వెంకటేశం, బ్రహ్మచారి, పోద్దార్ నంరేందర్, సారంగపాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యువత కమిటీ అధ్యక్షుడిగా ఎండీ ఆసన్, కార్యదర్శిగా శ్రీకాంత్, సంయుక్త కార్యదర్శిగా రమణ, కోశాధికారిగా సాయిరాం, ప్రచార కార్యదర్శిగా రతన్రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా విశ్వేశ్వర్, వినయ్ యాదవ్, సంతోష్ ఎన్నికయ్యారు. విద్యార్థి కమిటీ అధ్యక్షుడిగా ఎండీ గాయజ్, కార్యదర్శిగా ప్రణీత్కుమార్, ఉపాధ్యక్షుడిగా ఫాజిల్, సంయుక్త కార్యదర్శిగా అకిల్ రామవత్, కోశాధికారిగా నికిల్ కుమార్, ప్రచార కార్యదర్శిగా ఎండీ అమీర్, కార్యవర్గ సభ్యులుగా లక్ష్మణ్, అబ్దుల్ సజ్జీ, ఓవేస్ ఎన్నికయ్యారు.
మైనార్టీ కమిటీ అధ్యక్షుడిగా అబ్దుల్ గఫార్, కార్యదర్శిగా రహీం, సంయుక్త కార్యదర్శిగా సయ్యద్ సహెద్, కోశాధికారిగా సయ్యద్ ఖలీమొద్దీన్, ప్రచార కార్యదర్శిగా రషీద్అలీ ఎన్నికయ్యారు. మహిళా కమిటీ అధ్యక్షురాలుగా దౌలత్బేగం, కార్యదర్శిగా షాహిన్ సుల్తాన, సంయుక్త కార్యదర్శిగా రామావత్ తులసి, కోశాధికారిగా తపసుమ్, ప్రచార కార్యదర్శిగా రిజ్వన బేగం ఎన్నికయ్యారు. బీసీ కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా కనకచారి, బట్టి రఘులతో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఎన్నికైన కమిటీ అధ్యక్షులను సన్మానించారు. సమావేశంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గంగాధర్, కృష్ణాగౌడ్, నాయకులు శంకర్గౌడ్, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
పెద్దశంకరంపేటలో..
పెద్దశంకరంపేట, సెప్టెంబర్ 13 : టీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని ఎంపీపీ శ్రీనివాస్ అన్నారు. మండల పరిధిలోని గోపని వెంకటాపు రం, మాడ్చెట్పల్లి, టెంకటి కోళ్లపల్లి, కమలాపు రం, బద్దారం, గొట్టిముక్కుల, కొత్తపేట, బుజ్రాన్పల్లి, ఇస్కపాయల తండాలోటీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గోపని వెంకటాపురం టీఆర్ఎస్ అధ్యక్షుడిగా గోపని సాయిలు, ఉపాధ్యక్షుడిగా లక్ష్మయ్య, మాడ్చెట్పల్లి గ్రామ అధ్యక్షుడిగా కాగిత సాయిలు, టెం కటి గ్రామ అధ్యక్షుడిగా సాయిలు, కోళ్లపల్లి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా చంద్రకాంత్, కమలాపురం టీఆర్ఎస్ అధ్యక్షుడిగా పండరి, బద్దారం అధ్యక్షుడిగా సత్యనారాయణ, గొట్టిముక్కుల అధ్యక్షుడిగా గంగారాం, కొత్తపేట అధ్యక్షుడిగా సంగమేశ్వర్, బుజ్రాన్పల్లి గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా విఠల్, ఇస్కపాయల తండా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా దుర్గానాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విజయరామరాజు, వైస్ ఎంపీపీ లక్ష్మి , రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సురేశ్గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు ఉన్నారు.
కుర్తివాడ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నర్సింహులు
మండల పరిధిలోని కుర్తివాడ గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కొత్తూరి నర్సింహులు ఎంపికయ్యారు. ఉపాధ్యక్షుడిగా సామేల్, కార్యదర్శిగా మన్నె వెంకటేశం, సంయుక్త కార్యదర్శిగా బొందయ్య, కోశాధికారిగా కలీం, కార్యవర్గ సభ్యులుగా వడ్ల బ్రహ్మం, మల్లేశం, కుమార్, బాబ, కృష్ణారెడ్డి ఎన్నికయ్యారు.