దుబ్బాక, జూలై 14 : బోదవ్యాధి(ఫైలేరియా) ఆడ క్యూలెక్స్ దోమ ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. బోధ వ్యాధి మరణానికి దారి తీయకపోయినా.. దుష్పరిణామాలు చాలా తీవ్రమైనవి. వ్యాధి సంక్రమణను ప్రాథమిక దశలో గుర్తించడం కష్టసాధ్యం. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే నివా రణ చాలా సులభం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ముంద స్తు చర్యలు సత్ఫలితాలు ఇవ్వడంతో క్రమక్రమంగా బోధ వ్యాధిగ్రస్తులు తగ్గిపోతున్నారు. వ్యాధిగ్రస్తులకు ప్రతినెలా రూ.2016 పింఛన్ అందజేస్తూ తెలంగాణ సర్కారు అండగా నిలుస్తున్నది. సిద్దిపేట జిల్లాలో 2612 మంది పింఛన్ అందుకుంటున్నారు.
లింఫాటిక్ ఫైలేరియాసిస్ (ఎల్ఎఫ్)…
ఎల్ఎఫ్ పరాన్నజీవి (దారం వంటి పురుగు)తో వచ్చే వ్యాధి. మానవ శరీరంలోని శోష రస వ్యవస్థలో చేరిన ఫైలేరియా సూక్ష్మ దశలోని మైక్రోఫైలేరియా(ఎంఎఫ్)లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి శరీర ఉపరితల రక్షణ వ్యవస్థ(చర్మం)లోనికి చేరుతాయి. సదరు వ్యక్తుల రక్తాన్ని స్వీకరించిన దోమల్లోకి మైక్రో ఫైలేరియా చేరుతుం ది. సంక్రమిత మైక్రో ఫైలేరియా 12 రోజుల్లో పెరిగి, లార్వాదశకు చేరి, దోమకాటుతో మరొకరికి వ్యాప్తి చెందుతుంది. తొలిదశలో సాధారణ లక్షణాలు కనిపించవు. కానీ, లింఫ్ వ్యవస్థ దెబ్బ తిం టుంది. ఎల్ఎఫ్ ఉన్న వ్యక్తులను గుర్తించలేము. కానీ, వీరి ద్వారా పరాన్న జీవి వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. పరాన్న జీవి సంక్రమణతో శోషరస (లింఫ్) నాళాల్లో ఉత్పత్తిని అస్థిరపరుస్తుంది. దీన్నే ఎడినో లింఫానిజైటిస్ అంటారు. సంక్రమిత శరీర భాగాల్లో మంట, ఎర్రబారడం లక్షణాలతోపాటు తరుచూ జ్వరం వస్తుంది.
1, వ్యాధి లక్షణాలు…
ఇంటికి వచ్చి మాత్రలు ఇస్తాం..
సిద్దిపేట జిల్లాలో అల్బెండజోల్, డీఈసీ మాత్రలను ఇంటికి వెళ్లి పం పి ణీ చేస్తాం. జిల్లాలో 9,50,000 మం దికి మాత్రలు అందజేస్తాం. జిల్లాలో 35 పీహెచ్పీ కేంద్రాలు, 3 అర్బన్ సెంటర్ల ద్వారా మొత్తం 3786 మంది సిబ్బందితో పాటు 1893 బృందాలను ఏర్పాటు చేశాం. మరో 35 రాపిడ్ రెస్పాన్స్ బృందాలు సిద్ధం ఉన్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వశాఖలతోపాటు ప్రజాప్రతినిధుల సహకారంతో మాత్రల(డీఎంఏ) పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చే శాం. ఇప్పటికే జిల్లా, మండల స్థాయి కమిటీలతో సమావేశా లు నిర్వహించాం. భోజనం లేదా అల్పాహారం తీసుకున్న తర్వాత మాత్రలు తీసుకోవాలి. బోద వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. కరోనా వైరస్ చికిత్స పొందుతున్న వారికి, రెండేండ్లలోపు పిల్లలకు మాత్రలు వేయడం లేదు.
– మనోహర్, సిద్దిపేట జిల్లా వైద్యాధికారి
మెదక్ జిల్లాలో 7,54,400 మందికి..