జిన్నారం, జూలై 27: అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం ఆహార భద్రత కార్డులు అందజేస్తున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం ఊట్ల శివారులోని ఎన్ఆర్ఎస్ ఫంక్షన్హాల్లో 177 మంది లబ్ధిదారులకు రేషన్కార్డులు, 33 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను సంగారెడ్డి జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ రవీందర్గౌడ్తో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలోనే పటాన్చెరు నియోజకవర్గానికి అధిక రేషన్కార్డులు వచ్చాయన్నారు. అర్హులందరికీ రేషన్కార్డులతో పాటు ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు. రేషన్కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కోసం అర్హులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. గత ప్రభుత్వాల హ యాంలో ప్రభుత్వ పథకాలు అర్హులకు ఈ స్థాయిలో ఎప్పుడూ అందలేవన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ బాం డ్లను అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, తహసీల్దార్ దశరథ్, సర్పంచ్లు లావణ్యశ్రీనివాస్రెడ్డి, రేఖాకృష్ణ, ప్రకాశ్చారి, ఆంజనేయులు, శివరాజ్, జనార్దన్, ఖదీర్, చిట్ల సత్యనారాయణ, శ్రీకాంత్రెడ్డి, ఎంపీటీసీలు సంతోషమహేశ్, లావణ్యనరేశ్, స్వాతిప్రభాకర్రెడ్డి, జనాబాయి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్, కోఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్ అహ్మద్, నాయకులు పాల్గొన్నారు.
చాలా సంతోషంగా ఉంది
నా కుటుంబానికి రేషన్ కార్డు రావడం సంతోషంగా ఉంది. వివిధ అవసరాలకు రేషన్ కార్డు అడిగే వారు. కార్డులేక చాలా ఇబ్బందులు పడ్డాం. రేషన్ సరుకులకు కూడా ఇబ్బందులు ఉం డేవి. ఇకమీదట ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.