పటాన్చెరు/ అమీన్ఫూర్, ఏప్రిల్ 4 : సంగారెడ్డి జిల్లా అమీన్ఫూర్ పెద్ద చెరువుకు మహర్దశ చేకూరనున్నది. దేశంలోనే మొట్టమొదటి జీవవైవిధ్య సరస్సుగా గుర్తింపు సాధించిన అమీన్పూర్ పెద్ద చెరువును పర్యాటక కేంద్రంగా మార్చడానికి దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థ అర్బన్ రైజ్ తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకున్నది. ఈ మేరకు హైదరాబాద్ నగరం సమీపంలోని 50 చెరువులను సుందరీకరిస్తారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పర్యవేక్షణలో వాకింగ్ ట్రాక్, ల్యాండ్ స్కేపింగ్, ఓపెన్ జిమ్, బెంచీలు, వాష్రూంలు, పిల్లల ఆట స్థలాలు, గెజిబో లు, థియేటర్లను ఏర్పాటు చేస్తారు. బయోడైవర్సిటీగా హెరిటెజ్ గుర్తింపు సాధించిన అమీన్ఫూర్ పెద్దచెరువు ను మరింత సుందరీకరిస్తున్నారు.
ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో చెరువులకు మహర్దశ వస్తున్నది. అమీన్పూర్ చెరువును సుందరీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అర్బన్ రైజ్ చైర్మన్ మనోజ్ ఎంవోయూ కుదుర్చుకున్నారు. అమీన్ఫూర్ సరస్సులో 170 రకాల పక్షులు జీవిస్తున్నాయని జీవవైవిధ్య మం డలి గుర్తించింది. పక్షులను సంరక్షించడంతోపాటు చె రువును పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేస్తారు. ఈ మేరకు అర్బన్రైజ్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్కు హామీ ఇచ్చారు. వలస పక్షులకు నిలయంగా చెరువును మార్చబోతున్నారు. అమీన్పూర్ పెద్దచెరువును అభివృ ద్ధి చేసేందుకు అర్బన్రైజ్ సంస్థ ముందుకు రావడంపై అమీన్పూర్ పాలకవర్గం హర్షం వ్యక్తం చేసింది.