మెదక్ మున్సిపాలిటీ, జూలై 22: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గంగినేని థియేటర్ వెనుక ప్రాంతంతో పాటు నల్లపోచమ్మ దేవాలయం వెనుక కాలని వరదతో ముంచె త్తింది. నర్స్ఖేడ్ వెళ్లే దారిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రాంగణంలో నీరు చేరింది. పట్టణ శివారులోని హల్దీ వాగు, పసుపలేరు వాగు, ఎంఎన్ కెనాల్ నిండుగా ప్రవహిస్తున్నాయి.
శిథిలావస్థలో ఉన్న ఇల్లు కూల్చివేత
పట్టణంలోని 23వ వార్డులోని చమాన్ ప్రాం తంలో శిథిలావస్థలోని ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చి వేశారు. మున్సిపల్ అధికారులకు, కౌన్సిలర్ ఆవారి శేఖర్ ఇంటి యజమాని (హైదరాబాద్లో ఉంటున్నాడు) కి సమాచారం అందించినా స్పందించక పోవడంతో జేసీబీతో కూల్చివేసి శిథిలాలను తొలిగించారు.
మెదక్ రూరల్…
మం డలంలో కురుస్తున్న వర్షాలకు కాళేశ్వరం నీళ్లతో , బొల్లారం మత్తడి , ర్యాలమడుగు , ప్రాజెక్టులు పూర్తి గా నిండి మత్తడి దుంకుతున్నా యి. చెరువులు, వాగులు, పొంగి ప్రవహిస్తున్నాయి. మంబోజిపల్లి పల్లెచెరువు, మాగ్దుమ్పూర్ చెరు వు , రాజ్పల్లి చెరువు , వెంకట పూర్ చెరువు రాయిన్పల్లి చెరువులు జలకళ సంతరించుకున్నాయి.
చిన్నశంకరంపేటలో…
మండలంలోని వివి ధ గ్రామాల్లో రెండు రోజులుగా వర్షం కురుస్తు న్నది. వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి.
పెద్దశంకరంపేటలో…
పెద్దశంకరంపేట మం డలంలోరెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటం తో చెరువులో, కుంటల్లో నీరు చేరి జలకళ సంతరించుకున్నాయి.