మంచిర్యాల : పిడుగుపాటుకు ఓ రైతు మృతిచెందాడు. ఈ విషాద సంఘటన మంచిర్యాల జిల్లా కాశీపేట్ మండలం వరిపేటలో గురువారం చోటుచేసుకుంది. మృతుడిని గ్రామానికి చెందిన గుండేటి మల్లేష్(65)గా గుర్తించారు. పొలం నుండి ఇంటికి తిరగి వెళ్తుండగా రైతు పిడుగుపాటుకు గురయ్యాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.