కొత్తగూడెం సింగరేణి, సెప్టెంబర్ 20: సింగరేణి 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన నికర లాభాలను ఈ నె ల 25వ తేదీన వెల్లడించనున్నామని సింగరేణి డైరెక్టర్ (పా) ఎన్ బలరాం అన్నారు. సోమవారం సింగరేణి ప్రధాన కా ర్యాలయంలో విలేకరులతో మాటాడ్లారు. 25వ తేదీన సింగరేణి బోర్డ్ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో సంస్థ పొందిన లాభాలను వెల్లడించనున్నామన్నారు. ఆ తరువాత సీఎం కేసీఆర్ లాభాల వాటాను ప్రకటిస్తారన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు. బొగ్గుకు డిమాండ్ పెరిగినందునా బొగ్గు ఉత్పత్తి, రవాణాకు పక్కా ప్రణాళికలు సి ద్ధం చేశామని పేర్కొన్నారు. కరోనాను కట్టడే లక్ష్యంగా సింగరేణి వ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు వారి కుటుంబసభ్యులు, మెగా వ్యాక్సినేషన్ క్యాంపులను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటివరకు 93.2 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశామని చెప్పారు. కాంట్రాక్టు కార్మికులకు వందశాతం వ్యా క్సినేషన్ వేసినట్లు తెలిపారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో సింగరేణి ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా కొత్తగూడెం, భూపాలపల్లి, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మించామని, మరో వారం లోగా గోదావరిఖని ఏరియాలో మెగా ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చే యనున్నట్లు చెప్పారు.
త్వరలో సంస్థలో ఖాళీగా ఉన్న 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయనున్నామని పేర్కొన్నారు. ఆరునెలల్లో సింగరేణి ప్రధాన దవాఖానలో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రస్తుతం నెలకు 3 వేల మందిని హైదరాబాద్ కార్పొరేట్ దవాఖానకు రెఫర్ చేస్తున్నామని, కొత్తగూడెం ప్ర ధాన వైద్యశాలను ఆధునీకరించనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు సింగరేణిలో వందమంది డిస్మిస్డ్ కార్మికులకు ఉద్యోగాలిచ్చామని తెలిపారు. భూపాలపల్లి, కొత్తగూడెం ఏరి యా, సత్తుపల్లిలోని కార్మికులకు సకల హంగులతో క్వార్టర్ల ను ఏర్పాటు చేశామని, త్వరలో కొత్తగూడెంలో కూడా కొత్త క్వార్టర్లు నిర్మిస్తామని ప్రకటించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంచడంతో రిటైర్డ్ అయిన 1,082 మంది కార్మికులు, అధికారుల్లో ఇప్పటి వర కు 1040 మంది విధుల్లో చేరారని, ఐదుగురు మరణించ గా, 37 మంది విధుల్లో చేరేందుకు సుముఖంగా లేరన్నారు. త్వరలోనే పది నూతన మైన్లను ప్రారంభించేందుకు అనుమతులు తీసుకున్నామని చెప్పారు. సీఎస్ఆర్ నిధులను సిం గరేణి ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు చేయనున్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో పర్సనల్ జీఎంలు పాల్గొన్నారు.