బెల్లంపల్లిటౌన్ : మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. పట్టణంలోని పోచమ్మ చెరువులో శనివారం చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థిక పరిపుష్టిని సాధించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, కౌన్సిలర్లు, కోఆఫ్షన్ సభ్యులు , నాయకులు , గంగ పుత్ర సంఘం నాయకులు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు, మత్స్యశాఖ ఏడీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని బూధకలాన్ గ్రామానికి చెందిన రాజలింగుకు లబ్ధిదారునికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గొమాస శ్రీనివాస్, నాయకులు మల్లేష్, దాడి నగేష్, తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతి నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.రూ. 25 లక్షలతో మున్సిపాలిటీకి సంబంధించిన నూతన జేసీబీ వాహనం, 4వ వార్డులో రూ.12. 50వేలతో ఏర్పాటు చేసిన జిమ్ను, ఏఎంసీ గ్రౌండ్ ఎదుట రూ. 5లక్షలతో నిర్మించిన లవ్ బెల్లంపల్లి సింబల్ ప్రదర్శనను మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్తో కలసి ప్రారంభించారు.