నారాయణపేట టౌన్, డిసెంబర్ 16 : జిల్లాలో పెండింగ్లో ఉన్న వివిధ రకాల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన 1, 7వ స్థా యీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. అధికారులు తమ శాఖలకు సంబంధించి ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ మక్తల్ నుంచి నారాయణపేటకు, అప్పక్పల్లి నుంచి గుండుమాల్కు వెళ్లే రహదారులు గుంతల మయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన పంచాయతీ రోడ్లు, లింక్ రోడ్లు దెబ్బతిన్నాయని మరమ్మతు పనులు చే పట్టాలని ఆదేశించారు. కృష్ణ, మాగనూర్, మక్తల్, ఊట్కూ ర్, మరికల్ మండలాల్లో ట్యాంకు నిర్మాణాలు పూర్తి చేసి ఆయా మండలాల్లోని పలు గ్రామాల్లో నీటి సమస్యను పరిష్కరించాలని మిషన్ భగీరథ అధికారులకు సూచించారు. కొత్త సబ్ స్టేషన్లకు తాత్కాలిక పద్ధతిలో ఆపరేటర్ల నియామకం చేపట్టి సబ్ స్టేషన్లను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని ఆమె చెప్పారు. విద్యుత్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ సిబ్బంది సహకరంతో ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు 101 యూనిట్ల సబ్సిడీ పథకం పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.
దామరగిద్ద జెడ్పీటీసీ లావణ్య అధ్యక్షతన నిర్వహించిన 6వ స్థాయీ సం ఘ సమావేశంలో గిరిజన సంక్షేమం, షెడ్యూల్డ్ కులా లు, మైనార్టీల సమస్యలపై చర్చించారు. మధ్యాహ్నం జెడ్పీ వైస్ చైర్పర్సన్ సురే ఖ అధ్యక్షతన 3వ స్థాయీ సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ అ డవి జంతువుల ఆహారం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. వ్యవసాయం, పశువైద్యం, ఉద్యానవన, భూ గర్భ జలాలు, మైనింగ్ శాఖలకు చెందిన అంశాలపై చర్చించారు. ఆయా సమావేశాల్లో వివిధ శాఖలకు చెందిన అధికారులు, జెడ్పీ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
యోగా శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులు విద్యార్థులకు యోగాలో మెళకువలు నేర్పించి రాష్ట్ర, జాతీయ స్థాయి పో టీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దాలని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ సూచించారు. జిల్లాలోని వ్యాయామ విద్య ఉపాధ్యాయులకు ఐదు రోజులపాటు పట్టణంలోని కృష్ణ గోకులం స్కూల్ లో యోగా శిక్షణ అందజేశారు. శిక్షణలో పాల్గొన్న వ్యాయా మ విద్య ఉపాధ్యాయులకు శుక్రవారం పట్టణంలోని జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ టీ షర్టులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగాతో అనేక దీర్ఘకాలిక రోగాలను నియంత్రించవచ్చన్నారు. చిన్నతనం నుంచే విద్యార్థులు యోగా నేర్చుకునేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ సురేఖ, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు వాహిద్ తదితరులు పాల్గొన్నారు.