మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 15 గంజాయి గుప్పుమంటున్నది. మహబూబ్నగర్ జిల్లాలో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రాత్రివేళల్లో యువత విచ్చలవిడిగా తిరిగి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దారినపోతున్న వారిపై దాడులు చేస్తు న్న సంఘటనలు కోకొల్లలు. దీనికి తోడు మత్తు లో దొంగతనాలు సైతం చేయడానికి వెనుకాడడం లేదు.
మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు యువకులు గంజాయి తాగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. విచారణ మొదలు పెట్టిన వారికి నమ్మలేని నిజాలు వెల్లడయ్యాయి. గంజాయి మత్తులోనే గొడవలు, దొంగతనాలు జరుగుతున్నాయని, మత్తుకు బా నిసగా మారిన యువత దానికోసం ఆత్మహత్యలకు సైతం వెనుకాడడం లేదని తేలింది. మ త్తుకు అలవాటుపడిన ఓ యువకుడు నేరుగా ఒప్పుకున్నాడు. మత్తు కోసం సూసైడ్ చేసుకునేందుకు సిద్ధమవడం కూడా మనం చూస్తు న్నాం. దీంతో పోలీసులు గంజాయి రవాణాపై దృష్టి పెట్టారు. యువత చెడుదారుల్లో పయనించడంపై, గొడవలకు దారితీయడం, రాత్రి వేళల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నట్లు పోలీసుల నిఘాలో తేలింది. ప్రాథమిక విచారణలోనే జిల్లాలో గంజాయి సరఫరా ముఠా తిష్టవేసినట్లు పోలీసులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ప్రధానంగా కళాశాలల్లో చదివే యువత గంజాయి మత్తులో జోగుతున్నారు. సరఫరా చేసే ముఠా జిల్లాను టార్గెట్ చేసింది. కొన్ని ప్రాంతాల్లో నిర్ధిష్ట సమయాలను ఎంచుకొని అమ్మకాలు సాగిస్తున్నారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎక్కువగా అమ్మకం సాగిస్తున్నట్లు సమాచారం. పలు ప్రాంతాల నుంచి విచ్చలవిడిగా వస్తున్నట్లు తెలుస్తున్నది.
పాలమూరు జిల్లాను అనుసరించి ఉన్న ప్రాంతాల నుంచి గంజాయి సరఫరా జోరుగా సాగుతున్నది. పోలీసులకు దొరకకుండా ప్రత్యే క వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సులు, రైళ్ల ల్లో గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్నా రు. ద్విచక్ర వాహనాలతో సైతం తరలిస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతం గంజాయి వి క్రయాలకు కేంద్రంగా మారినట్లు అనుమానా లు ఉన్నాయి. ఏపీలోని కొన్ని ప్రాంతాల నుం చి ఎక్కువగా నల్లమల, అచ్చంపేట మీదుగా.. తరలించి అక్కడి నుంచి పాలమూరుకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే కర్ణాటకలోని రాయిచూర్ నుంచి గంజాయి ఎక్కువగా దిగుమతి అవుతున్నది. కొన్ని ప్రైవేట్, ఉ న్నత విద్యా కళాశాలల్లో గంజాయి ఎక్కువగా విక్రయిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. జి ల్లా కేంద్రం శివారులోని గుట్టల ప్రాంతంలో ఉన్న కళాశాల పరిసరా ల్లో విక్రయాలకు ప్రత్యేక ముఠాలు ఏర్పడినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో గంజాయి వి క్రయం పెరిగిపోయింది. రెం డేండ్ల కిందటి వరకు విచ్చలవిడిగా సాగిన గంజాయి అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో కొంతకాలం నిలిచాయి. తర్వాత చాపకింద నీరులా దందా జోరందుకున్నది. ఇటీవల జరుగుతున్న వరుస దొంగతనాలకు ప్రధాన కారణం గంజాయి మత్తులోనే యువత చేస్తున్నారని తే లింది. ఇక తల్లిదండ్రులు, పిల్లల అలవాట్లపై ఆందోళన చెందుతున్నారు. నిన్న, మొన్నటి వరకు సక్రమంగా ఉన్న తమ బిడ్డలు ఒక్కసారిగా మారిపోవడం వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. పిల్లల అలవాట్లు, మత్తు వినియోగంపై ఎవరికీ చెప్పుకోలేక దవాఖానల చుట్టూ తిరుగుతున్నారు.
గంజాయికి బానిసైన యువత ఇటీవల రాత్రి వే ళల్లో రోడ్డుపై వెళ్తున్న ఓ లారీ అద్దాలు పగలగొట్టి ఘర్షణకు దిగారు. మరో సంఘటనలో మహబూబ్నగర్ టీచర్స్ కాలనీ పార్కులో కొందరు యువకులు గంజాయి తాగుతూ మత్తులో కొట్టుకున్నారు. ఓ బర్త్ డే వేడుకల్లో గంజాయి సేవించి పార్కులో యువకు లు న్యూసెన్స్ చేశారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి.. పోలీసులు కేసులు నమోదు చేసినవి కూడా ఉన్నాయి. పలు ముఠాల వివరాలు, విక్రయ కేంద్రాలపై పోలీసులు నిఘా పెట్టి అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టారు.
ఎన్హెచ్-44 వెంట ఉన్న బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, భూత్పూర్, మూసాపేట, అడ్డాకుల, కొత్తకోట, పెబ్బేరు, మానవపాడు, అలంపూర్ ప్రాంతాల్లోని దాబాలు, పాన్ డబ్బాల్లో గంజాయి విక్రయిస్తున్నారు. నల్లమలలోని పలు గ్రామాల్లో మత్తు పంటను సాగు చేసి అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్నారు. పాలమూరులోని రామయ్యబౌలి, ఏనుగొండ, బోయపల్లి, మోతీనగర్, కొత్త చెరువు రోడ్, గంజ్, షాషాబ్గుట్ట, ప్రేమ్నగర్, రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, జడ్చర్లలోని నిమ్మబావిగడ్డ, సిగ్నల్గడ్డ, రైల్వే స్టేషన్, పోలేపల్లి సెజ్ ప్రాంతాల్లో విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు తెలిసింది. కోస్గి, నారాయణపేట మక్తల్, వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, బల్మూరు, లింగాల ప్రాంతాల్లో దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నట్లు సమాచారం. పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వ్యాపారం జోరందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
కొన్ని ప్రాంతాలు, గుట్టల శి వారుల్లో ఉన్న విద్యాసంస్థల వ ద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం. అనుమానం వ చ్చిన ప్రాంతాలపై నిఘా పె ట్టాం. అమ్మకాలపై సీరియస్ గా వ్యవహరిస్తున్నాం. ప్రత్యే క బృందాలను రంగంలోకి దింపుతున్నాం. పోలీసులకు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉం చుతాం. గంజాయి విక్రయించినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవు. జాతీయ రహదారి వెంట ఇతర రా ష్ర్టాలకు చెందిన వారి కదలికలపై నిఘా పెట్టాం.