మహ్మదాబాద్, ఫిబ్రవరి 14 : పండుగ కోసం అక్క వాళ్ల ఇంటికి వచ్చి విద్యుదాఘాతానికి గురై ఓ యువతి మృతి చెందిన ఘటన గండీడ్ మండలంలోని పలుగుతండాలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. మద్దూరు మండలం కొత్తపల్లితండాకు చెందిన బెనిక్యానాయక్ తన కుటుంబసభ్యులతో కలిసి గండీడ్ మండలం పలుగుతండాలో పెద్దకూతురు సోనీబాయి ఇంట్లో తుల్జాభవానీ పూజకు వచ్చారు.
అందరూ సంతోషంగా పండుగ జరుపుకొంటుండగా సోనీబాయి చెల్లెలు పూజ (18) మంగళవారం రాత్రి 11:30 గంటలకు ఇంట్లో చార్జింగ్ పెట్టిన సెల్ఫోన్ను తీస్తుండగా విద్యుదాఘాతానికి గురైంది. వెంటనే యువతిని మహబూబ్నగర్ జనరల్ దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి తండ్రి బెనిక్యానాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు మహ్మదాబాద్ ఎస్సై శేఖర్రెడ్డి వెల్లడించారు.