జడ్చర్ల టౌన్, ఏప్రిల్ 8 : రైలు కిందపడి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన జడ్చర్ల మండలం గొల్లపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. రైల్వే ఎస్సై అ క్బర్ కథనం ప్రకారం.. బాలానగర్కు చెందిన సిం ధు(24) పోలేపల్లి సెజ్లోని హెటిరో కంపెనీలో పనిచేస్తున్నది. గొల్లపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నది.
విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పా లమూరు దవాఖానకు తరలించారు. కాగా డ్యూటీకి వెళ్లిన కూతురు ఇంటికి రాకపోవటంతో ఆమె తల్లిదండ్రులు బాలానగర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో గొల్లపల్లి వద్ద రైలు కిందపడి మృతిచెందిన యువతి ఆధారాల మేరకు ఆచూకీని గుర్తించిన పోలీసులు సదరు కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా వారు మృతదేహాన్ని గుర్తించారు. కాగా సింధు కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.