జోగులాంబ గద్వాల : వ్యవసాయ పొలం దున్నుతూ ఓ యువ రైతు( Young Farmer ) మృతి చెందాడు. ఈ ఘటన గురువారం జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండల పరిధిలోని చింతలకుంట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక తెలిపిన వివరాల ప్రకారం..
చింతలకుంట గ్రామానికి చెందిన రైతు మాల వీరేష్(30) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. గురువారం తన వ్యవసాయ పొలం దున్నుతుండగా గుండెపోటు ( Heart Attack ) రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రైతుకు భార్య, కూతురు ఉన్నారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనతో చింతలకుంట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.