మానవపాడు, జూలై 5 : కేసీఆర్ తాతను కలిసి తాను గీసిన కేసీఆర్ చిత్రపటాన్ని అందజేయాలని ఓ చి న్నారి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని అమరవాయి గ్రామానికి చెందిన నబీ, జ్యోతి హైదరాబాద్ లో నివాసం ఉంటుండగా వీరి కూతురు అల్ఫియా అ క్కడే శ్రీమేధా పాఠశాలలో 3వ తరగతి చదువుతు న్నది.
డ్రాయింగ్లో నైపుణ్యమున్న అల్ఫియా తండ్రి నబీ కేసీఆర్ అభిమాని కావడంతో ఇటీవల ఏప్రిల్లో కేటీఆర్ను కలిశారు. ఆరోజు అల్ఫియా కేసీఆర్ తాతను కలవాలని కేటీఆర్ను కోరడంతో త్వరలోనే కలిసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రానున్న రెండు, మూడు రోజుల్లో కే సీఆర్ను కలిసేందు కు ఆ చిన్నారికి అనుమతి వచ్చిందని సో షల్ మీడియాలో హాల్చల్ కాగా ఆ చిన్నారి కేసీఆర్ను కలిసిన రోజు బహూకరించేందుకు కేసీఆ ర్ చిత్రపటం వేసిన ట్లు తండ్రి నబీ తెలిపారు. కేసీఆర్ను కలిసి చిత్రపటాన్ని అందజేస్తామని నబీ తెలిపారు.