ఉద్యోగార్థులు ఆరు నెలలపాటు సోషల్ మీడియాకు దూరమవ్వాలి : కేటీఆర్
మహబూబ్నగర్, మే 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిరుద్యోగ యువత కష్టపడి ప్రభుత్వ ఉద్యోగా లు సాధించాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కాంక్షించారు. ఆరు నెలలపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండి సీరియస్గా ప్రిపరేషన్ పూర్తి చేయాలని సూచించారు. సోమవారం మహబూబ్నగర్ పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎక్స్పో ప్లాజా వద్ద టీఆర్ఎస్ పార్టీ జెండాను మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్తో కలిసి జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఎక్స్పో ప్లాజాలో శాం తానారాయణగౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్లోని ఉద్యోగార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సుమారు 90 వేల ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ చేపట్టారని తెలిపారు.
నిరుద్యోగులు ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ కష్టపడి ఉద్యోగాలు సాధించాలన్నారు. నిరుద్యోగులకు బెస్టాఫ్ లక్ చెప్పారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. పట్టణానికి అవసరమైన నిధులు ము న్సిపల్ శాఖ ద్వారా మంజూరు చేస్తామని చెప్పారు. పట్టణాభివృద్ధికి సహకారం ఉంటుందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఇంతియాజ్, వాల్యానాయక్, వెంకటేశ్వర్రెడ్డి ఉన్నారు.