పాలమూరు, ఫిబ్రవరి 15 : గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరమున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో గిరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి ఎంతో పాటుపడిందన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో గిరిజన భవనానికి రూ.1.15 కోట్లు మంజూరు చేశామన్నారు. ఆలయం కోసం రూ.41లక్షలు ఇచ్చినట్లు తెలిపారు.
గిరిజన విద్యార్థుల కోసం వసతిగృహం నిర్మాణం చేసినట్లు వెల్లడించారు. తండాలను పంచాయతీలుగా మార్చి పాలనను ద రికి చేర్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, కౌన్సిలర్లు శ్రీనివాసులు, రాంలక్ష్మణ్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, నవకాంత్ తదితరులు పాల్గొన్నారు.