అక్కడి స్టేషన్మీదుగా అనేక రైళ్లు వెళ్తున్నా.. ఆ ప్రాంత ప్రయాణికులు దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇబ్బందుల పడుతూ ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో స్టేషన్కు వెళ్తూ.. తమ స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు ఎప్పుడు నిలుస్తాయా అని ఎదురు చూసేవారు.. ఎంపీ, ఎమ్మెల్యే కృషితో వారి చిరకాల కోరిక నెరవేరడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దేవరకద్ర, ఫిబ్రవరి 13: నియోజకవర్గ కేంద్రంలోని రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు నిలపాలని మండల ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రయాణికులు అధికారులు, గత పాలకుల కు విన్నవించినా ఫలితం లేక పోయింది. కానీ మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కృషితో నేడు దేవరకద్ర రైల్వేస్టేషన్లో రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు నిలుపుతున్నారు. దేవరకద్ర రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు నిలుపుతుండడంతో దేవరకద్ర మండల ప్రజల తో పాటు మక్తల్, నారాయణపేట, చిన్నచింతకుంట, మరికల్, ధన్వాడ, అడ్డాకుల తదితర మండలాల ప్రజలు హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు సౌకర్యంగా మారింది.
దేవరకద్రలో ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిపేంందుకు మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దక్షణమధ్య రైల్వే అధికారులతో పలమార్లు చర్చలు జరిపి ఇక్కడి ప్రయాణికుల ఇబ్బందులు వివరించడంతో ప్రతి రోజు రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు నిలుపుతున్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీ, ఎమ్మెల్యే లకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ వెళ్లే ఇంటర్ సిటీ, తుంగభద్ర ఎక్స్ప్రెస్ ట్రైన్లు నిలుపుతున్నారు. ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ ఉదయం 7:30, తుంగభద్ర ఎక్స్ప్రెస్ సాయంత్రం 4:30 గంటలకు దేవరకద్ర స్టేషన్లో నిలుస్తాయని స్టేషన్ మాస్టర్ నవీన్ కుమార్ తెలిపారు. కాగా ఈ రెండు ట్రైన్లు నిలపడం వల్ల కేవలం హైదరాబాద్ వైపు వెళ్లడానికి మాత్రమే వీలైతుం దని తిరుపతి, బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్లే ఎక్స్ప్రెస్లు కూడా నిలపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
దేవరకద్ర రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైలు ఆగాలనే ఈ ప్రాంత ప్రయాణికుల చిరకాల కోరికను నెరవేర్చిన ఎంపీ, మన్నె శ్రీనివాస్రెడ్డి,ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. మండల ప్రజలే కాక సమీప మండలాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– గోవిందు, గూరకొండ
ఇక్కడ ఎక్స్ప్రెస్ ట్రైన్లు నిలపడం వల్ల హైదరాబాద్కు వెళ్లేందుకు చార్జీ తగ్గుతుంది. రైలులో వెళ్తే రూ.60 , బస్సుల్లో వెళ్తే రూ.170 అవుతుంది. ట్రైన్ లో వెళ్లడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతుంది. అధికారులు ఈ స్టేషన్ మీదుగా వెళ్లే అన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లను నిలిపితే ప్రయాణికులకు మరింత సౌకర్య వంతంగా ఉంటుంది.
– కృష్ణయ్య, దేవరకద్ర