భూత్పూర్(అడ్డాకుల): నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం అడ్డాకుల మండలంలోని సుంకరామయ్యపల్లిలో రూ.5లక్షలతో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి, అదేవిధంగా రూ.5లక్షలతో యాదవ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు దేవాలయ స్థలంలో గతంలో 60ఏండ్ల క్రితం నిర్మించుకున్న ఇండ్లను తొలగించాలని ఇంటి యజమానులకు ఇండ్లను తొలగించాలని ప్రభుత్వం తరపున నోటీసులను జారీ చేయగా ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధతో మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో మాట్లాడి గ్రామస్థులకు న్యాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానించారు.
అనంతరం గ్రామస్థులు సుంకరామయ్యపలిల కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ ఆసరా పెన్షన్లు, రేషన్ సరుకులు గ్రామం లో కాకుండా కందూరులో పంపిణీ చేస్తున్నందున ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇందుకు ఎమ్మెల్యే సంబంధిత తాసీల్దార్తో ఫోన్లో మాట్లాడుతూ సుంకరామయ్యపల్లిలోనే రేషన్ డీలర్తో సరుకులను, ఆసరా పెన్షన్లను ఇప్పించాలని ఆదేశించారు.
అంతేకాకుండా గ్రామంలోని రైతులు తమ వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు దారి సక్రమంగా లేదని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వ్యవసాయ పొలాల దారి మరమ్మతుకు గాను రూ.5లక్షలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ నాగార్జునరెడ్డి, జడ్పీటీసీ రాజశేఖర్రెడ్డి, సర్పంచు మల్లిక, ఎంపీటీసీ శ్యామలమ్మ, సింగిల్ విండో అధ్యక్షుడు జితేందర్రెడ్డి, వైస్ ఎంపీపీ రాధిక, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోకల శ్రీనివాస్రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, నాయకులు మహమూద్, రమేశ్గౌడ్ పాల్గొన్నారు.