భూత్పూర్, నవంబర్ 12 : గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధిని చూసి ప్రజలు కారుగుర్తుకు ఓటు వేసి పార్టీకి పట్టం కడుతారని, బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం పక్కా అని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లిలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూడాలన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలను సమాన దృష్టితో చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
‘ఎమ్మెల్యేను భారీ మెజార్టీతో గెలిపించాలి’ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప కోరారు.
ఆదివారం ఆయన మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లిలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి స మక్షంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ ఎంత కష్టపడ్డాడో తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేసేందుకు కూడా అంతే కష్టపడుతున్నట్లు తెలిపారు. కారుగుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి చాల మంచి వ్యక్తి, నిత్యం ప్రజల కోసం కష్టపడే మానవతావాది అన్నారు. భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూ ర్ బస్వరాజ్గౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహాగౌడ్, కౌన్సిలర్లు శ్రీనివాస్రెడ్డి, వసంతాగోపాల్, ముడా డైరెక్టర్లు చంద్రశేఖర్గౌడ్, సాయిలు, మాజీ ఎంపీపీ చంద్రమౌళి, మా జీ సర్పంచులు సత్తూర్ నారాయణగౌడ్, సత్యనారాయణ, నాయకులు సత్యనారాయణ, మురళీధర్గౌడ్, అశోక్గౌడ్ పాల్గొన్నారు.
మూసాపేట(అడ్డాకుల), నవంబర్ 13 : దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ అడ్డాకుల, మూసాపేట మండలాల్లో ఆ పార్టీ శ్రేణులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆదివారం, సోమవారం అడ్డాకులతోపాటు కాటవరం, గుడిబండ, శాఖాపూర్, కందూరు, పొన్నకల్, రాచాల, తిమ్మాయిపల్లి, తిమ్మాయిపల్లి తండాల్లో, మూసాపేట మండల కేంద్రంతోపాటు సంకలమద్ది, వేమలు, జానంపేట, పొల్కంపల్లి, చక్రాపూర్, నందిపేట, అచ్చాయిపల్లి, తుంకినీపూర్, సంకలమద్ది, కొమిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రభు త్వ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు.
కొత్తకోట, నవంబర్ 13 : ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి గెలుపు కోసం బీఆర్ఎస్ శ్రేణులు సో మవారం పట్టణంతోపాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్చైర్మన్ వామన్గౌడ్ మాట్లాడుతున్న తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధిస్తారని వారన్నారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, ఎంపీపీ గుంతమౌనిక, కౌన్సిలర్లు సంధ్య, పద్మ, కొండారెడ్డి, రాములుయాదవ్, రామ్మోహన్రెడ్డి, ఖాజమైనొద్దీన్, తిరుపతయ్య, నాగన్నసాగర్, సుజాత, మిసేక్, వహీద్ పాల్గొన్నారు.
దేవరకద్ర, నవంబర్ 13 : బడుగు బలహీన వర్గాల అభివృద్ధే బీఆర్ఎస్ ధేయ్యమని ఎంపీటీసీ ఆంజనేయులు అన్నారు. సో మవారం మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ కార్యకర్త లు ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి మరోసారి కారుగుర్తుకు ఓటు వేసి పట్టం కట్టాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణ, శ్రీనివాసులు, యాదగిరి, ఎర్రన్న పాల్గొన్నారు.
మదనాపురం, నవంబర్ 13 : తెలంగాణలో, దేవరకద్ర నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రావణ్కుమార్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావన్కుమార్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పర్యటను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దేవరకద్ర నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జయంతి, జెడ్పీటీసీ కృష్ణ య్య, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు రవీందర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ నాగన్నయాదవ్, ప్రచార కార్యదర్శి ప్రవీణ్రెడ్డి ఉన్నారు.
కొత్తకోట, నవంబర్ 13 : మండలంలోని పా లెం గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారిలో దేవన్న, నరేందర్, పరందాములు, కరుణాకర్, బాలరాజు, రామచారి, వెంకటేశ్, మహేశ్, రవి, సురేశ్తోపాటు మరో 50మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
భూత్పూర్, నవంబర్ 13 : అసెంబ్లీ ఎన్నిక ల ముందుకు బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ కేంద్రంలోని చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ ఇం ట్లో కాటం ప్రదీప్కుమార్గౌడ్ ఆధ్వర్యంలో దు ప్పల్లి, మీనిగోనిపల్లి, దేవరకద్ర మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలను దాదాపు 150మందిని బీఆర్ఎస్ పార్టీలో చేశా రు. వీరిలో ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బాలచందర్గౌడ్ ఉన్నారు. భూత్పూర్ మండలానికి చెందిన భవన నిర్మాణ కార్మిక సంఘం మండ ల అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, నర్సింహతోపాటు 150మంది, మూసాపేట మండలంలోని పోల్కంపల్లి గ్రామానికి చెందిన యాదవులు 50మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతు న్న అభివృద్ధిని చూ సి ఇతర పార్టీలకు చెం దిన నాయకులు, కార్యకర్త లు భారీ సంఖ్యలో వలసలు వ స్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 55ఏండ్లల్లో చేయని అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం తొమ్మిదిన్నర ఏండ్ల చేయడంతో ఆకర్శితులై బీఆర్ఎస్లోకి వస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, మూడా డైరెక్టర్లు చంద్రశేఖర్గౌడ్, సాయిలు, కోఆప్షన్ అజీజ్, మాజీ సర్పంచ్ సత్తూర్ నారాయణగౌడ్, నాయకులు గోప్లాపూర్ సత్యనారాయణ, మురళీధర్గౌడ్, అశోక్గౌడ్ పాల్గొన్నారు.