అలంపూర్, జనవరి 16 : తెలంగాణలో ఏకైక శక్తి పీఠంగా విరాజిల్లుతున్న జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు విస్తృత ప్రచారం కల్పించాలని అ లంపూర్ ఎమ్మెల్యే విజయుడు అధికారులకు సూచించారు. సోమవారం జోగుళాంబ అమ్మవారి ఆలయం లో జోగుళాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ ఆలయ విశిష్టతను గ్రామగ్రామానికి చాటాలన్నా రు. భక్తుల మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయాభివృద్ధికి అహర్నిశలు కృ షి చేస్తామన్నారు. ఆలయంలో జరుగుతున్న నిత్య పూ జాది కార్యక్రమాలను క్యాలెండర్లో ప్రచురించడం శు భపరిణామమన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే ఆలయాల్లో పూజలు చేశారు. కాగా, మకర సంక్రాంతిని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలోని వీరభద్రస్వామి ఆలయంలో నందికోళ సేవను నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చిన్న కృష్ణయ్య, ఈవో పురేందర్కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ శేఖర్రెడ్డి, సభ్యులు వెంకటేశ్వర్రెడ్డి, సత్యనారాయణ, అడివప్ప తదితరులు పాల్గొన్నారు.
యువత క్రీడల్లో రాణించాలి..
యువత క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మండలంలోని మాన్దొడ్డిలో సంక్రాంతిని పురస్కరించుకొని స్వయం భూ లక్ష్మీమాధవస్వామి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అనంతరం ఓపెన్ కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో క్రీ డాపోటీలు నిర్వహించడంపై ఆనందం వ్యక్తం చేశారు. గ్రామీణ క్రీడలకు అండగా ఉంటామని హమీ ఇచ్చారు. వాలీబాల్తోపాటు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసులు, వడ్డేపల్లి వైస్ ఎంపీపీ చంద్రగౌడ్, సర్పంచ్ సవారి, ఎంపీటీసీ మన్సూర్, వెంకట్రాముడు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.