నారాయణపేట, అక్టోబర్ 31: తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో దేశంలోనే నెంబర్వన్ స్థానంలో నిలిచిందని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని 10వ వార్డులోని కుర్వగేరి, చాకలిగేరిలో ఇంటింటి ప్రచారం చేశారు. మహిళలు రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి ముందుకు సాగగా ఇంటింటి ప్రచారం జోరుగా కొనసాగింది. ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాన్ని వివరిస్తూ మ్యానిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి 9ఏండ్లుగా పట్టణంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, మరింత అభివృద్ధి చెందాలంటే మరోసారి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి, కౌన్సిలర్లు మేఘా కులకర్ణి, శిరీష, రాజేశ్వరి, నారాయణమ్మ, అనిత, మాజీ కౌన్సిలర్ విజయలక్ష్మి, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు శ్రీపాద్ తదితరులు పాల్గొన్నారు.
కోయిలకొండ, అక్టోబర్ 31: మండలంలో బీఆర్ఎస్ నాయకులు మంగళవారం విస్తృత ప్రచారం చేశారు. కోయిలకొండ, ఇబ్రహీంనగర్, చౌదర్పల్లితండా, నల్లవెల్లి, తదితర గ్రామాల్లో నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాజేందర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట టౌన్, అక్టోబర్ 31: పట్టణంలో మంగళవారం బీఆర్ఎస్ నాయకుల ఇంటింటి ప్రచారం జోరుగా కొనసాగింది. పట్టణంలోని 8, 12, 13, 15, 18 తదితర వార్డుల్లో కౌన్సిలర్ గురులింగం, బీఆర్ఎస్ నాయకులు శివరాంరెడ్డి, వెంకట్రాములు, కార్తీక్, సుభాశ్, ప్రతాప్రెడ్డి, హన్మంత్రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేశారు. గడపగడపకు వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని తెలియజేస్తూ, బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేను గెలిపించాలని కోరారు.
దామరగిద్ద, అక్టోబర్ 31: మండంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ బూత్ కమిటీ సభ్యులు మంగళవారం కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. ఉల్లిగుండంలో బూత్ కమిటీ సభ్యులతోపాటు ఎంపీటీసీ కిషన్రావు ఇంటింటికీ తిరిగి ఓటు అభ్యర్తించారు. కందెన్పల్లి, మండల కేంద్రంలో బూత్ కమిటీ సభ్యులు ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉలిగుండం వెంకటేశ్, శివరాజ్ పాల్గొన్నారు.
మరికల్, అక్టోబర్ 31: తెలంగాణలో అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాల అమలుకు బీఆర్ఎస్ను మరోసారి గెలిపించుకోవాలని జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని 11,12,13 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడారు. కార్యాక్రమంలో వైస్ ఎంపీపీ రవికుమార్, సర్పంచ్ గోవర్ధన్, ఎంపీటీసీ గోపాల్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తిరుపతయ్య, యూత్ అధ్యక్షుడు రాజేశ్, నాయకులు బసంత్, రామస్వామి, కొండారెడ్డి, కృష్ణయ్య, నర్సింహులు, జగదీశ్ పాల్గొన్నారు.
ధన్వాడ, అక్టోబర్ 31: కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి ఆధోగతి పడుతుందని ధన్వాడ సర్పంచ్ చిట్టెం అమరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలకేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మండలంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టిన ఎస్.ఆర్రెడ్డిని అధిక మోజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట రూరల్, అక్టోబర్ 31: పేట మండలంలోని పేరపళ్లతండా, అప్పిరెడ్డిపల్లి, జాజాపూర్తోపాటు తదితర గ్రామాల్లో మంగళవారం బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఓటర్లకు వివరించారు. కార్యక్రమంలో తిరుపతినాయక్, నారాయణరెడ్డి, వెంకటప్ప, కనకప్ప సుభాన్రెడ్డి, విశ్వనాథ్, బాలప్ప తదితర నాయకులు పాల్గొన్నారు.