కోయిలకొండ: తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పార్పల్లి, ఆనంతాపూర్, కోతలాబాద్ , కోయిలకొండ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లోఆయన పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శమయ్యాయని కరోనా వచ్చినా రైతులకు రైతు బీమా, రైతు ంధు అందిస్తున్నామని తెలిపారు.
ఆడపడుచులకు వివాహాల కోసం కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ వరంలా మారిందన్నారు. కోయిలకొండ మండలంలో నూతనంగా మంజూరైన 200 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారు లకు చెక్కులు అందజేశారు. మండలంలోని వింజమూర్, చంద్రాస్పల్లి గ్రామాలకు సీఎం సహయనిధి ద్వారా మంజూరైన శోభ రెడ్డి రూ.5లక్షలు ఎల్వోసీ చెక్కు ను బాధితుడికి అందజేశారు.
మత్స్యకారుల అభివృద్ధికి కృషి…
తెలంగాణ ప్రభుత్వంలో మత్స్యకారుల జీవనోపాధి కోసం ఉచితంగా నాణ్యమైన చేప పిల్లలను అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. శనివారం పారుపల్లి, కోతలాబాద్ చెరువుల్లో ప్రభుత్వం ఉచితంగా అందించిన 2లక్షల 50వేల చేపపిల్లలను ఎమ్మెల్యే వదిలేశారు.
వందశాతం అభివృద్ధి సాధించాలి…
గ్రామ పంచాయతీలో అమలు చేస్తున్న పల్లె ప్రగతితో వందశాతం అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. కోతలాబాద్లో రూ.13లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించి, ఉన్నత పాఠశా లలో రూ9లక్షలతో నిర్మించే సైన్స్ ల్యాబ్ పనులకు శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో నవోదయ చైర్మన్ ఎస్.రవీందర్ రెడ్డి, ఎంపీపీ శశికళాభీంరెడ్డి, జడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు బీ.కృష్ణయ్య, వైస్ ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, రైతుబంధు కన్వీనర్ మల్లయ్య, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు మాణిక్యమ్మ, చరితారెడ్డి, ఎంపీటీసీ సత్యయ్యగౌడ్, అంజనేయులు, నాయకులు రాజేంద్రప్రసాద్ గౌడ్, మాదవరెడ్డి, రాజవర్దన్రెడ్డి, రవి, శ్రీనివాస్రెడ్డి, జగదీశ్వర్రెడ్డి, మత్య్సశాఖ ఏడీ రాధరోహిణి, ఫీల్డ్ అధికారులు నవీన్, రాందాస్ మత్స్య సంఘం నాయకులు లవయ్య, రాములు, సత్తయ్య, రామకృష్ణ, శేఖర్ పాల్గొన్నారు.