వనపర్తి, జనవరి 1 : రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు మా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంద న్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని 238 మందికి సీఎం సహాయనిధి నుంచి విడుదలైన రూ.67 లక్షల విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
అనంతరం కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, స్థానిక నాయకులతోపాటు చెక్కులు అందు కున్న వారితో కలిసి మంత్రి భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబానికి సీఎం సహాయనిధి నుంచి సాయం అందుతుందన్నారు. పారదర్శకంగా ప్ర భుత్వం పాలన అందిస్తున్నదని చెప్పా రు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ మన ప్రభుత్వం మాదిరిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కావడం లేద న్నారు.
అభివృద్ధితో బీఆర్ఎస్ ప్రజలను జాగృతం చేస్తున్నదన్నారు. అవినీతి, విద్వేషాలతో బీజేపీ ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్న దని ధ్వజమెత్తారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను అభివృద్ధి చేసి ప్రజలకు ఉపాధి పెంచే ప్రయత్నం ప్రభు త్వం చేస్తుందన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని మర్రికుంట వద్ద, వశ్యనాయక్ తండాలో జరుగు తున్న కాల్వ పనులను మంత్రి పరిశీ లించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్, వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు లక్ష్మీ నారాయణ, కంచెరవి, నందిమల్ల భువనేశ్వరి, బండారు కృష్ణ, పాకనాటి కృష్ణయ్య, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు జోహెబ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సూర్యవంశం గిరి, పరంజ్యోతి, లతీఫ్, మార్క్ఫెడ్ డైరెక్టర్ విజయ్, యువజన సంఘం మండల అధ్యక్షుడు రాము, కార్యదర్శి గణేశ్, నాయకులు రమేశ్నాయక్, కృష్ణయ్య, శివ, నాయ కులు పాల్గొన్నారు.