అయిజ, జనవరి 9 : మున్సిపాలిటీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డితో క లిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, తాగునీటి సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలోని 20వార్డుల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత కల్పించాలని ఎ మ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి మున్సిపల్ కౌన్సిల్కు సూచించారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణాభివృద్ధికి నిధుల విడుదల చేయించేందుకు ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో అయిజ మున్సిపాలిటీకి డబుల్ ఫ్లస్ అవార్డు రావడం సంతోషకరమన్నారు. కౌన్సిలర్లు, అధికారులు సమన్వయంతో పట్టణాభివృద్ధికి పాటుపడాలని కోరారు. 15 అంశాలపై చర్చించిన కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు మున్సిపల్ కమిషనర్ నిత్యానంద్ తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ దేవన్న, వైస్ చైర్మన్ నర్సింహులు, కౌన్సిలర్లు, కో ఆప్సన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
పట్టణంలోని పెద్దవాగుపై రూ.కోట్లతో నిర్మిస్తు న్న హైలెవల్ వంతెన పనులు నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మె ల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అధికారులను ఆదేశించారు. పెద్దవాగుపై వంతెన నిర్మాణం దృష్ట్యా ప్రజలు రవాణాపరంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను గ్రహించి పనులు ఈనెలాఖరు నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అంతకుముందు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను పరిశీలించారు.