పాలమూరు, నవంబర్ 5 : రైతును రాజు చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ మండలం మన్యంకొండ చౌరస్తాలో కోటకదిర పీఏసీసీఎస్ చైర్మన్ రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. గతంలో కరువుతో అల్లాడిన పాలమూరు రైతులు ఇప్పుడు ఏడాదికి మూడు పంటలు పండిస్తూ సంతోషంగా ఉన్నారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కాలువలు రాకముందే మహబూబ్నగర్ గ్రామీణ మండలంలో అత్యధికంగా ధాన్యాన్ని పండించిన ఘనత ఈ ప్రాంత రైతులకు ఉందన్నారు. దీంతో ఇక్కడి భూములకు విలువ లు, రైతులు, కూలీలకు గౌరవం పెరిగిందన్నారు.
మ న్యంకొండ ఆలయ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొండపైన నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హాల్ 18 గదులను నెలలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రూ.1.34 కోట్లతో రెండు షెడ్లు, నరసింహాస్వామి ఆలయానికి రహదారి నిర్మిస్తామన్నారు. వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి మన్యంకొండ ఆలయం వరకు డబుల్రోడ్డు, సెంట్రల్ లైటింగ్, గుట్టపైకి వెళ్లేందుకు రో ప్వే ఏర్పాటు చేస్తామన్నారు. అలివేలు మంగ ఆల యం వద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్, టూరిజం హోటల్ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ఎంపీపీ సుధాశ్రీ, వైస్ ఎంపీపీ అనిత, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, జిల్లా డైరెక్టర్ నర్సింహారెడ్డి, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, డీఏవో వెంకటేశ్, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ జగదీశ్, డీఎస్వో బాలరాజు, ముడా డైరెక్టర్ ఆంజనేయులు, కో ఆపరేటివ్ అధికారి టైటాస్ పాల్, సర్పంచులు చంద్రకళ, రమ్య, నాయకులు శ్రీనివాస్యాదవ్, దేవేందర్రెడ్డి, రూరల్ తాసిల్దార్ పాండునాయక్, ఏఈ రాములు తదితరులు పాల్గొన్నారు.
పర్యాటక కేంద్రంగా ట్యాంక్బండ్..
మహబూబ్నగర్టౌన్, నవంబర్ 5 : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ తె లిపారు. శనివారం జిల్లా కేంద్రం సమీపంలోని మౌలాలీగుట్ట వద్ద రూ.5.29 కోట్లతో నిర్మించిన 50 కేఎల్డీ ట్రీట్మెంట్ ప్లాంట్ను మంత్రి ప్రారంభించారు. అలాగే అప్పన్నపల్లిలో రూ.15లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణాలు, నగరాల్లో మలం వ్యర్థాలను వాగులు, వంకలు, రహదారులపై పారబోయడం వల్ల ప్రజలు, జంతువులకు హానికరంగా మారుతుందన్నారు. వీటిని నివారించేందుకు మహబూబ్నగ ర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ ప్లాంట్ ఏ ర్పాటు చేశామన్నారు.
ఈ ప్లాంట్లో మలం వ్యర్థాలను శుద్ధి చేసి ఎరువును తయారు చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్లాంట్ పక్కనే జంతుసంరక్షణ కేంద్రం ఏర్పాటు చే శామన్నారు. మహబూబ్నగర్ మినీట్యాంక్బండ్ను అత్యంత సుందరమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. శిల్పారామం పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్నందలాల్పవార్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, కౌన్సిలర్లు రోజా, రామాంజనేయులు, రవికిషన్రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు రామలింగం, నాయకులు నగేశ్, ఖాజాపాషా, వెంకటేశ్, శ్రీను, వెంకట్రాములు, సంజీవ్, అధికారులు పాల్గొన్నారు.
క్షయ వ్యాధి గ్రస్తులకు ఉచిత మందులు..
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, నవంబర్ 5 : క్షయ వ్యాధి నిర్మూలనకు కలిసికట్టుగా కృషి చేయాలని మం త్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. క్యాంప్ కార్యాలయంలో క్షయ వ్యాధిగ్రస్తులకు హెల్త్కిట్లను పంపిణీ చే శారు. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వమే ఖరీదైన మందులు ఉచితంగా సరఫరా చేస్తుందని మంత్రి తెలిపారు. లక్షణాలు ఉన్నవారు ప్రభుత్వ దవాఖానల్లో పరీక్షలు చే యించుకొని.. ఆరు నెలలపాటు మందులు వాడితే తగ్గిపోతుందన్నారు. కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ మహేశ్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ రఫీక్, జిల్లా టీబీ కో ఆర్డినేటర్ గోపాలకృష్ణ ఉన్నారు.