నవాబ్పేట, జనవరి 11: అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్లో ఉందని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. రైతుబంధు సంబురాల్లో భాగంగా మంగళవారం గురుకుంట రైతువేదిక నుంచి నవాబ్పేట మీదుగా ఫతేపూర్ మైసమ్మ ఆలయం వరకు 250ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యే హాజరై ర్యాలీని ప్రా రంభించారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడారు. సంక్షేమ పథకాల్లో తెలంగాణకు ఏ రాష్ట్రం సాటిరాదన్నారు. రైతులకు పంటల పెట్టుబడికి ఎకరాకు రూ.5వేలు ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అదేవిధంగా రైతుబీమా, మిషన్భగీరథ, కల్యాణలక్ష్మి తదితర పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదన్నారు. దేశంలో జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్ దొంగల పార్టీగా, బీజేపీ జూటా పార్టీగా మారాయని విమర్శించారు.
ఆకట్టుకున్న ట్రాక్టర్ల ర్యాలీ
మండలంలోని ఆయా గ్రామాల టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ట్రాక్టర్లతో తరలొచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. గురుకుంట రైతువేదిక నుంచి ఫతేపూర్ మైసమ్మ ఆలయం వరకు భారీ ర్యాలీ కొనసాగింది. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గురుకుంట నుంచి ఫతేపూర్ మైసమ్మ ఆలయం వరకు ట్రాక్టర్ నడుపగా.. ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అదే ట్రాక్టర్లో ప్రయాణించారు. చీమలదండలా కదిలిన ట్రాక్టర్లను చూసి ఎంపీ, ఎమ్మెల్యే పార్టీ క్యాడర్కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మధుసూధన్రెడ్డి, ఏవో కృష్ణకిశోర్, వైస్ ఎంపీపీ సంతోష్రెడ్డి, కోఆప్షన్ సభ్యులు తాహెర్, సర్పంచులు గోపాల్గౌడ్, యాదయ్యయాదవ్, సత్యం, అమ్మాపూర్ సత్యం, కారూర్ లక్ష్మారెడ్డి, నర్సింహనాయక్, ఎంపీటీసీ రాధాకృష్ణ, నాయకులు నాగిరెడ్డి, ప్రతాప్, గండు చెన్నయ్య, మెండె లక్ష్మయ్య, శీనయ్య, అబ్దుల్లా, చందర్నాయక్, నవనీతరావు, మెండె శ్రీను, దేపల్లి రాములు, శ్రీనివాస్రెడ్డి, కృష్ణగౌడ్, నర్సింహులు, రైతులు పాల్గొన్నారు.
రైతులు బాగుండాలన్నదే సంకల్పం
రాష్ట్రంలో రైతులు బాగుండాలన్నదే సీఎం కేసీఆర్ సంక్పలమని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. రైతుబంధు సంబురాలను మంగళవారం మండలంలోని కోడ్గల్లో ఘనంగా నిర్వహించారు. సంబురాలకు ఎమ్మెల్యేతోపాటు ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, హాజరయ్యారు. ముందుగా గ్రామంలో ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల ఊరేగింపులో ఎమ్మెల్యే, ఎంపీ పాల్గొని ట్రాక్టర్ నడిపారు. అనంతరం మహిళలు వేసిన ముగ్గులను తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నాలుగేండ్లలో రైతుబంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.50వేల కోట్లు జమచేసిందని, గత ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లో రూ.50 కూడా జమచేయలేదని విమర్శించారు. రైతుబంధు పథకంతో రైతులందరూ సంతోషంగా ఉన్నారన్నారు. అనంతరం ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయరంగాన్ని ప్రైవేట్పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తే రైతులందరూ తిరగబడ్డారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఒక్క పథకమైన సక్రమంగా అమలవుతుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలను తెలంగాణ ప్రజలు నమ్మేపరిస్థితిలో లేరని పేర్కొన్నారు.
కార్యకర్త కుటుంబానికి చెక్కు అందజేత
బూర్గుపల్లికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త మధు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. పార్టీ బీమా ద్వారా మంజూరైన రూ.2లక్షల చెక్కును ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కార్యకర్త కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, సర్పంచ్ మమత, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, నాయకులు ఇంతియాజ్ఖాన్, రాజేందర్రెడ్డి, గిరియాదవ్, శంకర్నాయక్, కొండల్, శ్రీకాంత్రెడ్డి రైతులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా సంబురాలు
మండలంలోని తాటిపర్తిలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ సమక్షంలో రైతుబంధు సంబురాలు నిర్వహించారు. సర్పంచ్ వెంకటయ్య ఆధ్వర్యంలో మంగళవారం రైతులు వేరుశనగ చేనులో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహగౌడ్, కౌన్సిలర్లు శ్రీనివాస్రెడ్డి, రామకృష్ణ, నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, సాయిలు, సత్యనారాయణ, అజీజ్, వెంకటేశ్ పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని సర్పంచులు పేర్కొన్నారు. రైతుబంధు సంబురాలను నాయినోనిపల్లి, యారోనిపల్లిలో ఘనంగా నిర్వహించారు. యారోనిపల్లిలో సీఎం కేసీఆర్ చిత్రపటం వేసి సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పెద్ద చెన్నయ్య, ఉపసర్పంచ్ వెంకటమ్మ, నాయకులు అనంతరెడ్డి, వెంకటేశ్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.