వనపర్తి : సామాన్యుడి చెంతకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతున్నాయని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మదనాపురం మండలం రామన్ పాడు గ్రామంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వారి నివాసాలకు వెళ్లి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటూ బంగారు తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తామంతా పనిచేస్తున్నామని అన్నారు.