వనపర్తి రూరల్, ఆగస్టు 20 : వనపర్తి జిల్లాకే తలమానికంగా తిరుమలయ్యగుట్ట నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శ్రావణ శనివారం సందర్భంగా పెద్దగూడెం శివారులోని తిరుమలయ్యగుట్టపై ఉ న్న తిరుమలనాథుడిని మంత్రి దర్శించుకున్నా రు. గుట్ట పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణాల పక్కనే అటవీ ప్రాంతం ఉండడం రాష్ట్రంలోనే ఒకటి రెండు ప ట్టణవాసులకు ఆహ్లాదకర వాతావరణం ఉం టుందన్నారు. ఈ ప్రాంతం అరుదైన వనమూలికలకు ప్రసిద్ధి చెందిందన్నారు. ఖాళీ ప్రదేశాలతోపాటు పిచ్చి చెట్లను తొలగించి పెద్దఎత్తున మొక్కలను పెంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గుట్ట చుట్టూ సుందరీకరణ ప నులు చేపడుతామని తెలిపారు. కొండపైకి చేరుకునే రహదారి వెంట మెట్లు ఏర్పాటు చేయిస్తామన్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది లే కుండా, పాదచారులకు ప్రమాదాలు జరగకుం డా చర్యలు తీసుకుంటామని చెప్పారు. భక్తులకు శాశ్వత పార్కింగ్ వసతి, నీటి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. తిరుమలనాథ స్వామిని దర్శ నం చేసుకున్న తర్వాత ఆలయ పరిసరాల్లో వెలిసిన దుకాణాల్లో మిఠాయిలను మంత్రి కొనుగో లు చేసి భక్తులకు అందజేశారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. రెడ్క్రాస్, సాగర్ స్నేక్ సొసైటీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కవర్లు వాడకుండా జూట్ బ్యాగులు పంపిణీ చేశారు. కార్యక్రమం లో జెడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, గొర్రెల కాపరుల సంఘం జిల్లా కన్వీనర్ కురుమూర్తి యాదవ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సిం హ, ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, కృ ష్ణానాయక్, రూప్లా, నాయకులు పాల్గొన్నారు.