వనపర్తి టౌన్, జూన్ 10 : దేశంలో ఎక్కడా పల్లె, ప ట్టణ ప్రగతి కార్యక్రమాలు లేవని, తెలంగాణ మినహా దేశంలో ఏ గ్రామానికి వెళ్లినా ఊరికో ట్రాక్టర్, ట్యాంకర్లు లేవని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలానగర్లో నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. బాలానగర్ సమీపంలోని వ నపర్తి మురికి కుంటకు మోక్షం లభించిందని, సింగిల్విండో పక్కన ఉన్న 2.31 ఎకరాల ప్రభుత్వ స్థలం గుర్తించామని రూ.10కోట్ల విలువైన స్థలాన్ని మున్సిపాలిటీకి అప్పగించామన్నారు. కాలనీవాసులకు ఇబ్బందికరంగా మారిన మురికి కూపం మున్సిపాలిటీకి అప్ప గించి మురికికుంటను పూడ్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
పల్లె, పట్టణ ప్రగతితోనే మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతను ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలతో డెంగీ, మలేరియా వంటి వ్యాధులు త గ్గుముఖం పట్టాయన్నారు. దేశంలో ప్రకటించిన 20 ఆదర్శ గ్రామాల్లో 10గ్రామాలు తెలంగాణలోనే ఉండడం సీఎం కేసీఆర్ ముందుచూపు పరిపాలన, దక్షతకు నిదర్శనమన్నారు. ప్రతి గ్రామపంచాయతీకి నెలవారీగా ని ధులు ఇచ్చేది తెలంగాణ రాష్ట్రం ఒక్కటేనని చెప్పారు. హరితహారం, పల్లె ప్రకృతి వనాలతో పచ్చబడుతున్న పల్లెలతోపాటు అటవీ శాతం పెరిగిందన్నారు. కాలనీల్లో పర్యటించి ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్ లక్ష్మీనారాయణ, కంచె రవి, బండారు కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు పరంజ్యోతి, మురళీసాగర్ పాల్గొన్నారు.