వనపర్తి, జూన్ 3 (నమస్తే తెలంగాణ)/వనపర్తి రూ రల్ : గ్రామ పంచాయతీలకు నెలనెలా నిధులిచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని వ్యససాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. వ నపర్తి మండలం పెద్దగూడెం, అంకూరు గ్రామాల్లో ఐ దో విడుత పల్లెప్రగతి, వనపర్తి మున్సిపాలిటీలో నాలు గో విడుత పట్టణప్రగతిని జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి,కలెక్టర్ షేక్ యాస్మిన్బాషాతో కలిసి మంత్రి ప్రారంభించా రు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడు తూ గడిచిన ఏడు దశాబ్దాల్లో దేశంలో ఎక్కడా లేని వి ధంగా నిధులిచ్చి గ్రామాలను బాగు చేసిన దాఖలాలు లేవన్నారు. టీఆర్ఎస్ హయాంలో పల్లెలు, పట్టణాలు చాలా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు గ్రామపంచాయతీలకు నిధు లు ఇస్తున్నట్లు తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతితో పచ్చదనం, పారిశుధ్యం మెరుగైందన్నారు. 15 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ఇందులో అంద రూ భాగస్వాములు కావాలన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. గ్రామాల్లో కంపతారు చెట్లను వేర్లతో సహా తొలగించాలన్నారు.
పెద్దగూడెంలో ఆరు ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న క్రీడా మైదానాన్ని రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా తీర్చిదిద్దుతామని, క్రీడా నిపుణు ల సలహాలు తీసుకుంటామన్నారు. పెద్దగూడెం గ్రామ యువకుల కోరిక మేరకు చదువుకునేందుకు గుట్టపై ఉన్న రాజుల కాలంనాటి భవనానికి ఇంజినీర్ అధికారులు పరిశీలన చేసి నిర్మాణం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఖాన్ చెరువుకు భీమా కాలువ ద్వారా త్వరలోనే నీళ్లు వస్తాయని, దీనికి సంబంధించిన ఫైల్ సీఎం కేసీఆర్ వద్ద ఉందని.. త్వరలోనే లైన్క్లియిర్ అవుతుందన్నారు. ముస్లింల కోరిక మే రకు శ్మశాన వాటికకు నిధులు కేటాయించి ప్రహరీ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. 30 ఏండ్ల నాటి కలను సాకారం చేస్తున్న మంత్రి నిరంజన్రెడ్డికి కృతజ్ఞతగా.. ఆయన పే రునే క్రీడామైదానానికి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిగా నామకరణం చేసినట్లు యువకులు తెలిపారు. కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా మాట్లాడుతూ ప్రజలు అధికారులతో కలిసి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. పచ్చదనానికి ప్రాధాన్యమివ్వాలని సూచించా రు.
మున్సిపల్ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ మాట్లాడుతూ మంత్రి నిరంజన్రెడ్డి చేస్తున్న అభివృద్ధిని ప్రజలు హర్షిస్తున్నారన్నారు. ఇది చూసి ఓ ర్వలేని టీడీపీ, కాంగ్రెస్ నాయకులు అవాస్తవాలు ప్రచా రం చేస్తున్నారని, వారిని ప్రజలు తరిమి కొడతారన్నా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎంపీపీ కిచ్చారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, వక్ఫ్ బోర్డు మెంబర్ జహంగీర్, కౌన్సిలర్ నాగన్న యాదవ్, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు చిట్యాల రాము, టీఆర్ఎస్ శిక్షణ తరగతుల జిల్లా కన్వీనర్ మెంటెపల్లి పురుషోత్తంరెడ్డి, డీపీవో సురేశ్కుమార్, డీఆర్డీవో నర్సింహులు, డీడబ్ల్యూవో పుష్పలత, వనపర్తి పీఏసీసీఎస్ చైర్మన్ వెంకట్రావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ జగన్మోహన్రెడ్డి, మిషన్ భగీరథ డీఈ మేఘారెడ్డి, సర్పంచులు విష్ణువర్ధన్రెడ్డి, కొండన్న, ఎంపీటీసీలు రంగారెడ్డి, ధర్మానాయక్, నాయకులు రవికిరణ్, వెంకట్రాములు, మాణిక్యం, లక్ష్మీకాంత్రెడ్డి, అశోక్కుమార్, బుచ్చిబాబు, యాదగిరిరెడ్డి, కోలమయ్య, హలీం, రాములు యాదవ్, దామోదార్రెడ్డి, నరసింహ, రవి, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.