వనపర్తి, ఏప్రిల్ 14 : ఎవరి హక్కు.. ఎవరి వా టా వారికి దక్కాలన్నదే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అభిలాష అని వ్యవసాయ శాఖ మంత్రి సిం గిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. అందులో భాగంగా నే దళితులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అ మలు చేస్తున్న పథకం దళితబంధు అన్నారు. ఈ పథకంలోని అర్హులు లబ్ధిదారులు కాదని.. వా రంతా హక్కుదారులని పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానం లో 80 మంది దళితబంధు లబ్ధిదారులకు వాహనాలను, ప్రొసీడింగ్ పత్రాలను కలెక్టర్ యాస్మి న్బాషా, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డితో కలి సి మంత్రి అందజేశారు. అలాగే అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితబం ధు పథకం అమలు మీద అపోహలు సృష్టించడం సరికాదన్నారు. అంబేద్కర్ అంతర్జాతీయ మానవుడుగా అభివర్ణించారు. తా త్కాలిక ప్రయోజనాలు క ల్పించి ప్రజలను గత ప్రభుత్వాలు మభ్య పెట్టాయని, కానీ శాశ్వతంగా ఉ పాధి కల్పించడం మీద దృష్టి సారించలేదన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు చిట్టెం, ఆల మాట్లాడుతూ బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే ప్రభుత్వం డబ్బు జమ చేస్తుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, ఆశిష్ సంగ్వాన్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి మల్లికార్జున్, మున్సిపల్ చైర్మన్లు గట్టు యాదవ్, కరుణశ్రీ, సుకేశిని, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కొత్తకోట ఎంపీపీ గుంత మౌనిక, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయాలను నెరవేరుద్దాం
అం బేద్కర్ ఆశయాలను నెరవేరుద్దామని, అందుకో సం మనమంతా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ షేక్ యాస్మిన్బాషాతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన స మావేశంలో మంత్రి మాట్లాడారు. దళితబంధు ల బ్ధిదారులు ఆసక్తి, అనుభవం ఉన్న రంగాల్లో యూనిట్లలో కూలీల నుంచి యజమానులుగా, ల క్షాధికారి నుంచి కోటీశ్వరులుగా ఎదిగి ఆర్థికాభివృ ద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అం బేద్కర్ను దళిత వర్గాలకు పరిమితం చేయొద్దని, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. అంబేద్కర్ ఆలోచనల నుంచి జ నించిన పబ్లిక్ రంగ సంస్థలను పీఎం మోదీ కార్పొరేట్ శక్తులకు అమ్ముకుంటున్నారన్నారు. ప్రభుత్వరంగ సంస్థల్ని అమ్ముకుంటూపోతే ఉన్న ఉద్యోగాలు పోవడంతోపాటు కొత్త ఉపాధి అవకాశాలు కరువవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన హ క్కులను కాలరాస్తున్న కేంద్రంలోని ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. అనంతరం వివి ధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు.
దివ్యాంగులు ఆత్మైస్థెర్యంతో ముందుకెళ్లాలి
దివ్యాంగులు ఆత్మైస్థెర్యంతో అడుగులు వేయాలని మంత్రి సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సదరం క్యాంపును కలెక్టర్తో కలి సి మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ అర్హులందరికీ ట్రై సైకిళ్లు అందిస్తామని తెలిపారు. స్టీఫెన్ హాకింగ్ స్ఫూర్తిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో దివ్యాంగులకు ఉచిత కోచింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సదరం క్యాంపు ద్వారా ఎంపికైన వారికి సర్టిఫికె ట్లు, పరికరాలు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమాల్లో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, మున్సిపల్ చై ర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, ఎంపీపీ కిచ్చారెడ్డి, దళిత సంఘం నేత వెంకటేశ్, సాంఘిక సంక్షేమ అధికారి సుశిత, మాతాశిశు సంక్షేమాధికారి పుష్పలత, డీఆర్డీవో నర్సింహులు ఉన్నారు.
ప్రభుత్వం కుటుంబంలాంటిది
ప్రభుత్వం కుటుంబంలాంటిదని, పెద్దన్న పాత్ర పోషిస్తున్నదని, ఉన్న వనరులతోనే ప్రజల అవసరాలను తీర్చుతూ కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలని మంత్రి నిరంజన్రెడ్డి అన్నా రు. గురువారం మండలంలోని ఉప్పర్పల్లి గ్రామం లో ఎంపీటీసీ సునీత కుమారుడు వెంకటేశ్వర్రెడ్డితోపాటు 200 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో న్యాయవాది ఉత్తరయ్య, స ర్పంచులు రాంరెడ్డి, బాలస్వామి తదితరులున్నారు.
అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టం
అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమని మంత్రి తెలిపారు. మండలంలోని ఉప్పరిపల్లి లో అంబేద్కర్ విగ్రహాన్ని జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడితో కలిసి మంత్రి ఆవిష్కరించారు. అంతకుముందు మంత్రికి స్థానికులు స్వాగతం పలికారు.
ఆశ్విని భవిష్యత్కు అభయం..
తల్లిదంద్రులు కోల్పోయిన ఆశ్విని భవిష్యత్కు భరోసానిస్తానని మంత్రి తెలిపారు. ఉప్పరిపల్లికి చెందిన ఎరుకలి ముత్యాలమ్మ మనుమరాలు అశ్విని తల్లిదండ్రులను కోల్పోయి అ నాథగా మిగిలిన విషయం మంత్రి దృష్టికి వెళ్ల గా.. ఆయన చిన్నారిని అక్కున చేర్చుకొని గురుకులంలో చదువుకుంటానన్నా.. వనపర్తిలోని తన ఇంట్లో ఉండి చదువుకుంటానన్న.. బాధ్య త తనే తీసుకుంటానని మంత్రి అభయమిచ్చా రు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ల క్ష్మారెడ్డి, ఎంపీపీ కృష్ణనాయక్, నాయకులు కృష్ణయ్య, మురళీధర్రెడ్డి, వెంకట్రావు, క్యామరా జు, నాయకులు పాల్గొన్నారు.